BigTV English

CM Revanth Reddy: గుండె కరిగిపోయే దృశ్యాలు.. సీఎం రేవంత్ ఎమోషనల్ ట్వీట్

CM Revanth Reddy: గుండె కరిగిపోయే దృశ్యాలు.. సీఎం రేవంత్ ఎమోషనల్ ట్వీట్

CM Revanth Reddy Emotional tweet about Floods: తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ప్రళయం సృష్టించింది. ఈ వరదలకు కొంతమంది మృత్యువాత పడగా.. జనజీవనం స్తంభించిపోయింది.


ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో 30 కి పైగా కాలనీలు నీటమునిగాయి. ఈ పరిస్థితులపై మొదట అధికారులతో సమావేశమైన సీఎం.. అనంతరం నేరుగా రోడ్డు మార్గంలో ఖమ్మంలో పర్యటించారు. ఈ మేరకు అక్కడి బాధితుల పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఖమ్మంలో ఎటుచూసిన గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే కష్టాలు కనిపించాయని చెప్పారు. వరద నీటిలో మునిగిపోవడంతో ఇంట్లోని వస్తువులు పాడైపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. నేను అక్కడ కష్టాలను స్వయంగా చూశానని చెప్పుకొచ్చారు. అలాగే బాధితుల మొఖాలలో ఓ వైపు తీరని ఆవేదన, మరోవైపు అన్న వచ్చాడన్న భరోసా కనిపించిందన్నారు. వారి కష్టాలను స్వయంగా చూశానని అన్నారు. వీళ్ల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తెంగాణ ప్రభుత్వం ఎంతటి సాయమైనా చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. వీళ్ల కష్టం తీర్చడానికి ఎంతటి సాయమైనా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.


కాగా, అంతకుముందు మార్గమధ్యలో సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. అనంతరం వరద బాధితులను పరామర్శించారు. అక్కడి నుంచి ఖమ్మం బయలుదేరారు. అక్కడ వరదల ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించారు. అలాగే వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన మోతీలాల్, అశ్విని కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం వెళ్లారు.

Also Read:  ఏడుపాయలను చుట్టుముట్టిన వరద.. ఆలయం మూసివేత

వరదలు బాధాకరమైన సందర్భమన్నారు. ఈ మేరకు ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు తక్షణ సహాయం కింద రూ.10వేలు అందజేయాలని ఆదేశించారు. అలాగే పశువులు మరణిస్తే రే.50వేలు, ఇతర తీవ్రతను బట్టి రూ. 5వేలు అందించాలని చెప్పారు. దీంతోపాటు పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాలకు రూ.10వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నష్టంపై అధికారులు అంచనా వేసి నివేదికలు ఇస్తే వాటికి అనుగుణంగా పరిహారం ఇస్తామని చెప్పారు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×