BigTV English
Advertisement

Mahabubabad Track: పూర్తికాని ట్రాక్ రిపేర్ పనులు.. మరో 28 రైళ్లు రద్దు

Mahabubabad Track: పూర్తికాని ట్రాక్ రిపేర్ పనులు.. మరో 28 రైళ్లు రద్దు

Trains Cancelled Between Vijayawada to Secundrabad : ఆగస్టు 31న కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లా కే సముద్రం – ఇంటికన్నె- తాళ్లపూసలపల్లి మార్గంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ధ్వంసమైన ట్రాక్ ను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టింది దక్షిణమధ్య రైల్వే. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. సుమారు పదివేల మంది ఉద్యోగులు ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారు.


శనివారం అర్థరాత్రి ట్రాక్ వరద తాకిడికి కొట్టుకుపోగా.. ఇప్పటికీ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దీంతో మూడోరోజు కూడా విజయవాడ – సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటి వరకూ 496 రైళ్లు రద్దవ్వగా.. 152 రైళ్లను దారి మళ్లించారు. ట్రాక్ పునరుద్ధరణ పూర్తికాకపోవడంతో 28 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ మేరకు సీపీఆర్ఓ శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు.

Also Read: ప్రకాశం బ్యారేజ్ గేట్ల డ్యామేజ్ పరిస్థితి ఏంటి? సీఎం చంద్రబాబు, నిపుణుడు కన్నయ్య పరిశీలన.. కాకపోతే..


సెప్టెంబర్ 3న రద్దయిన రైళ్లు

12709 – గూడూరు – సికింద్రాబాద్
12710 – సికింద్రాబాద్ – గూడూరు
12727 – విశాఖపట్నం – హైదరాబాద్
12739 – విశాఖపట్నం – సికింద్రాబాద్
20810 – నాందేడ్ – సంబల్ పూర్
12745 – సికింద్రాబాద్ – మణుగూరు
17659 – సికింద్రాబాద్ – భద్రాచలం రోడ్
17250 – కాకినాడ పోర్ట్ – తిరుపతి
17233 – సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్
12775 – కాకినాడ పోర్ట్ – లింగంపల్లి
12615 – ఎంజీఆర్ చెన్నై – న్యూ ఢిల్లీ
17205 – సాయినగర్ షిరిడీ – కాకినాడ పోర్ట్
12749 – మచిలీపట్నం – బీదర్
12750 – బీదర్ – మచిలీపట్నం
17208 – మచిలీపట్నం – సాయినగర్ షిరిడీ

సెప్టెంబర్ 4న రద్దయిన రైళ్లు

12746 – మణుగూరు – సికింద్రాబాద్
17660 – భద్రాచలం రోడ్ – సికింద్రాబాద్
11019 – సీఎస్ఎంటి ముంబై – భువనేశ్వర్
20707 – సికింద్రాబాద్ – విశాఖపట్నం
20708 – విశాఖపట్నం – సికింద్రాబాద్
20833 – విశాఖపట్నం – సికింద్రాబాద్
20834 – సికింద్రాబాద్ – విశాఖపట్నం
12706 – సికింద్రాబాద్ – గుంటూరు
12705 – గుంటూరు – సికింద్రాబాద్
17206 – కాకినాడ పోర్ట్ – సాయినగర్ షిర్డీ
17234 – సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్
12713 – విజయవాడ – సికింద్రాబాద్
12714 – సికింద్రాబాద్ – విజయవాడ
12776 – లింగంపల్లి – కాకినాడ పోర్ట్

సెప్టెంబర్ 5న రద్దయిన రైళ్లు

03260 – ఎస్ఎంవీటీ బెంగళూరు – దానాపూర్
17205 – సాయినగర్ షిరిడీ – కాకినాడ పోర్ట్

నిన్నటి వరకూ ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరద.. నేడు 8 లక్షల క్యూసెక్కులకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు బుడమేరు, మున్నేరుకు సైతం వరద తగ్గడంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నెమ్మదిగా తగ్గుతుంది.

Related News

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

Big Stories

×