E-Paper
Advertisement

Heavy Rains: బీ అలర్ట్..! ఏపీ, తెలంగాణలో మరో వారం రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

Heavy Rains: బీ అలర్ట్..! ఏపీ, తెలంగాణలో మరో వారం రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..
Advertisement

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు రోజులుగా కాస్త బ్రేక్ ఇచ్చిన వర్షాలు మళ్లీ నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో దంచికొడుతుంది. రాత్రి హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్, ఆరాంఘర్, మైలదేవర్‌పల్లి, చాంద్రాయణ గుట్ట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లన్నీ చెరువులై పారాయి. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మరో వారం రోజులు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు..
అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో మరో వారం రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంతం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్రలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని, కొద్ది చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొన్నారు. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

ఏపీలో ఈ జిల్లాల ప్రజల అలర్ట్..
ఈ క్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో పలు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ..
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

Advertisement

వర్షాల కారణంగా సముద్రంలోకి వెళ్లద్దని మత్స్యకారులకు సూచన..
తుపాను ముప్పు తప్పడంతో ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు పౌర్ణమి సమీపిస్తున్న నేపథ్యంలో సముద్రంలో ఆటు పోట్లు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. దీంతో చిన్న పడవలపై చేపల వేటకు వెళ్లే వారు ఇవాళ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు తెలియజేసారు. మరోవైపు తీర ప్రాంత ప్రజలు కొత్త పంటలను ఈ నెల తర్వాత సాగు చేస్తే మంచిదనే సూచనలు ఇస్తున్నారు. ఇప్పటి పలు ప్రాంతాల్లో వేసిన పంట వర్షాల పాలైంది. దీంతో రైతులు కూడా అప్రమత్తంగా మెలగాలని సూచిస్తోంది.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×