BigTV English
Advertisement

Telangana BJP chief: టీబీజేపీ చీఫ్ రేసులో ఉన్నది వీరే.. కమలనాథుల వ్యూహం పెద్దదే..!

Telangana BJP chief: టీబీజేపీ చీఫ్ రేసులో ఉన్నది వీరే.. కమలనాథుల వ్యూహం పెద్దదే..!

Telangana BJP chief: తెలంగాణ బీజేపీకి రేపో, మాపో కొత్త చీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక ఇప్పటికే తుది దశకు చేరుకుంది. పార్టీ చీఫ్ పేరును ప్రకటించడానికి బీజేపీ హైకమాండ్ సిద్ధమైంది. చీఫ్ పేరుపై జాతీయ నాయకత్వం ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకీ బీజేపీ బలపడుతుండడంతో ఆ పార్టీ హైమాండ్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అధ్యక్షుడిని ఆచితూచి ఎంపికచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


ఈ అంశాలను పరిగణలోకి తీసుకోనున్న హైకమాండ్..

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసేందకు కావల్సిన లక్షణాలు, అందరినీ కలుపుకుని ముందుకెళ్లడం, అన్ని ప్రాంతాలకు సుపరిచితుడై, స్థాయి, హోదా ఉన్న నాయకుడిని స్టేట్ చీఫ్ గా ఎంపిక చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి పేరు కోసం రాష్ట్రానికి చెందిన కీలక నేతలైన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌లతో చర్చించి.. నామినేషనల్ వేయించాల్సిందిగా పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.


కేంద్ర మంత్రి శోభకారంద్లాజేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు, సంస్థాగత ఎన్నికలకు ఇంఛార్జిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ కు చేరుకుని హైకమాండ్ సూచించిన నాయకుడి నుంచి నామినేషన్ స్వీకరించనున్నారు. ఒక్కటే నామినేషన్ దాఖలు చేసి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి మోదీ నాయకత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటికే ఇదంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని రాష్ట్ర బీజపీ కీలక నేతలు చెబుతున్నారు.

చీఫ్ రేసులో పోటీపడుతున్న నేతలు..

అయితే బీజేపీ పార్టీ రాష్ట్రంలో రోజురోజుకీ బలపడుతుండడంతో పార్టీ కొత్త చీఫ్ గా ఎవరు ఎంపిక అయితారో అని సొంత పార్టీ నాయకులు, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడి ఎంపిక ఉత్కంఠను రేపుతోంది. మామూలుగా చీఫ్ రేసులో ఎంపీలు ముందుంటారు. ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన ఎంపీలు అందరూ తమకంటే తమకు పార్టీ చీఫ్ పోస్టు కావాలని ఆశతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అధ్యక్ష ఎన్నిక తర్వాత కేంద్ర కేబినెట్ లోకి మరొకరికి ఛాన్స్ ఉందని సమాచారం.

చీఫ్ రేసులో ఎవరు ఉన్నారంటే..?

కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి నేతల పేర్లు టీబీజేపీ చీఫ్ రేసులో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే తాను పార్టీ అధ్యక్ష రేసులో లేనని బండి సంజయ్ ఇప్పటికే పలు మార్లు క్లారిటీ ఇచ్చేశారు. టీబీజేపీ చీఫ్ కు సంబంధించి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈటల రాజేందర్ చెబుతున్నారు. ఇటీవల మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరిగితే.. రెండు స్థానాలను బీజేపీ గెలుచుకుని మంచి రాజకీయ బలాన్ని పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడాలని కసరత్తు చేస్తోంది. అయితే కొత్త చీఫ్ ఎవరు అయితారు.. పార్టీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా.. అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది.

టీబీజేపీ కొత్త చీఫ్ రేసులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరుతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పేరు కూడా షార్ట్ లిస్ట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. మరి టీబీజేపీ చీఫ్ పదవి ఎవరిని  వరిస్తుందో చూడాలి.

ALSO READ: Jobs: ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. ఈ రోజే లాస్ట్ డేట్

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×