E-Paper
Advertisement

Telangana High Court: తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తూ ప్రాణాలు విడిచిన లాయర్

Telangana High Court: తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తూ ప్రాణాలు విడిచిన లాయర్

Telangana High Court: ఇటీవల పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తూ, ఊరేగింపులో వరుడు ఊరేగుతూ, ఇలా వేర్వేరు ఘటనల్లో పలువురు కుప్పకూలి మృతి చెందిన ఘటనలు వరుసగా జరిగాయి. సేమ్ టు సేమ్ అలాంటి ఘటన తెలంగాణలో మంగళవారం జరిగింది. తెలంగాణ హైకోర్టులో ఓ లాయర్.. సీరియస్ గా వాదనలు వినిపిస్తూ, తుదిశ్వాస విడిచారు. ఏకంగా న్యాయస్థానంలోనే ఆయన కుప్పకూలి మృతి చెందడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

న్యాయవాది పసునూరి వేణుగోపాల్.. రోజు వారీ మాదిరిగానే మంగళవారం హైకోర్టుకు వచ్చారు. తన క్లయింట్ తరపున సీరియస్ గా వాదనలు వినిపిస్తున్నారు. అప్పుడే అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలారు. వెంటనే న్యాయమూర్తి ఆదేశాల మేరకు న్యాయవాదులు, ఆయనను వైద్యశాలకు తరలించారు. అంతలోనే వేణుగోపాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  వాదనలు వినిపిస్తూ న్యాయవాది వేణుగోపాల్ కుప్పకూలి, కన్నుమూయగా, తోటి న్యాయవాదులు దిగ్భ్రాంతికి గురయ్యారు. న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టు లో అన్ని బెంచ్ లలో విచారణలను న్యాయమూర్తులు నిలిపి వేశారు. అన్ని కోర్టులలో విచారణలను రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు నిర్ణయం తీసుకున్నారు. కాగా వేణుగోపాల్ ఎన్నో కీలకమైన కేసులను వాదించి న్యాయవృత్తిలో పేరు ప్రఖ్యాతులు సాధించారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×