E-Paper
Advertisement

Telangana High Court: తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తూ ప్రాణాలు విడిచిన లాయర్

Telangana High Court: తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తూ ప్రాణాలు విడిచిన లాయర్

Telangana High Court: ఇటీవల పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తూ, ఊరేగింపులో వరుడు ఊరేగుతూ, ఇలా వేర్వేరు ఘటనల్లో పలువురు కుప్పకూలి మృతి చెందిన ఘటనలు వరుసగా జరిగాయి. సేమ్ టు సేమ్ అలాంటి ఘటన తెలంగాణలో మంగళవారం జరిగింది. తెలంగాణ హైకోర్టులో ఓ లాయర్.. సీరియస్ గా వాదనలు వినిపిస్తూ, తుదిశ్వాస విడిచారు. ఏకంగా న్యాయస్థానంలోనే ఆయన కుప్పకూలి మృతి చెందడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

న్యాయవాది పసునూరి వేణుగోపాల్.. రోజు వారీ మాదిరిగానే మంగళవారం హైకోర్టుకు వచ్చారు. తన క్లయింట్ తరపున సీరియస్ గా వాదనలు వినిపిస్తున్నారు. అప్పుడే అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలారు. వెంటనే న్యాయమూర్తి ఆదేశాల మేరకు న్యాయవాదులు, ఆయనను వైద్యశాలకు తరలించారు. అంతలోనే వేణుగోపాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  వాదనలు వినిపిస్తూ న్యాయవాది వేణుగోపాల్ కుప్పకూలి, కన్నుమూయగా, తోటి న్యాయవాదులు దిగ్భ్రాంతికి గురయ్యారు. న్యాయవాది మృతికి సంతాపంగా హై కోర్టు లో అన్ని బెంచ్ లలో విచారణలను న్యాయమూర్తులు నిలిపి వేశారు. అన్ని కోర్టులలో విచారణలను రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు నిర్ణయం తీసుకున్నారు. కాగా వేణుగోపాల్ ఎన్నో కీలకమైన కేసులను వాదించి న్యాయవృత్తిలో పేరు ప్రఖ్యాతులు సాధించారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×