E-Paper
Advertisement

Kosgi Municipality : కోస్గి మున్సిపాలిటీ.. అవిశ్వాసానికి హైకోర్టు బ్రేక్..

Kosgi Municipality : కోస్గి మున్సిపాలిటీ.. అవిశ్వాసానికి హైకోర్టు బ్రేక్..
Advertisement
Kosgi Municipality news

Kosgi Municipality news(Telangana today news):

నారాయణపేట జిల్లా.. కోస్గి మున్సిపాలిటీ(Kosgi Municipality) వ్యవహరం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు అవిశ్వాస తీర్మానం(No Confidence Motion) ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సవాల్ చేస్తూ.. ఛైర్ పర్సన్ శిరీష..హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అవిశ్వాస తీర్మాన ప్రక్రియను అడ్డుకోవాలని కోరుతూ పిటిషన్ వేయగా.. హైకోర్టు పిటిషన్ అనుమతించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి.. నారాయణ పేట్ కలెక్టర్ కు, కోస్గి మున్సిపల్ కమిషనర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

అయితే మరోవైపు ముందుగా ప్రకటించిన ప్రకారం ఉదయం 11 గంటలకు అవిశ్వాసంపై బల పరీక్ష జరగగా.. ఉన్న 14 మంది సభ్యుల్లో 10 మంది ఛైర్ పర్సన్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే కోర్టు ఆదేశాలతో ఈ ఆవిశ్వాస తీర్మానానికి ఇప్పుడు బ్రేక్ పడింది. తెలంగాణ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తూ ఊహించని ఝలక్ ఇస్తున్నారు. కానీ హైకోర్టు ఆదేశాలతో ఛైర్ పర్సన్ శిరీష.. ప్రస్తుతానికి బయటపడ్డారని కౌన్సిలర్లు అంటున్నారు.

Advertisement

కోస్గి మున్సిపాలిటీలో మొత్తం 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో 3వ వార్డు సభ్యురాలు మృతి చెందగా.. 10వ వార్డు సభ్యుడిపై అనర్హత వేటు పడింది. దాంతో 14మంది కౌన్సిలర్లతోనే అవిశ్వాసం తీర్మానం కొనసాగింది. ముందుగా మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి వార్డు కౌన్సిలర్లు నోటీసులిచ్చారు. అవిశ్వాసంపై చర్చకు ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రామచందర్ నియమితులయ్యారు. ఎన్నికలకు ముందు ఒకరు.. ఇటీవలే మరో ఇద్దరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. దాంతో ఛైర్ పర్సన్ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.

Tags

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×