E-Paper
Advertisement

TDP : తెలంగాణలో టీడీపీ బలమెంత? కేడర్ ఎటువైపు? తాజా లెక్కలేంటి?

TDP :  తెలంగాణలో టీడీపీ బలమెంత? కేడర్ ఎటువైపు? తాజా లెక్కలేంటి?
Advertisement

TDP : రాజకీయ నాయకులకు అల్టిమేట్‌గా కావాల్సింది పవర్. అధికారం కోసం తిట్టుకుంటారు. అవసరమైతే కౌగిలించుకుంటారు. కానీ జనాలకు మాత్రం ఎప్పుడూ ఓ క్లారిటీ ఉంటుంది. దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటారు. అమిత్ షా- చంద్రబాబు భేటీపై తెలుగు రాష్రాల్లో ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. పొత్తుపై పార్టీల్లో నేతల అభిప్రాయం ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారన్నది తర్వాత సంగతి. అసలు తెలంగాణలో టీడీపీకి ఓటు బ్యాంకు ఎక్కడిది? ఇదే మెయిన్ ప్రశ్న. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ నిలబడితే జస్ట్ 5 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. 3 జిల్లాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కేవలం 5వేల ఓట్లా?

Advertisement

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో, ఆ మాటకొస్తే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఓటు గెలుపును నిర్దేశిస్తుంది. ఇది నిజం. కానీ ఆ ఓటు మొత్తం ఎప్పుడో టీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వైపు నిలబడినట్టు కనిపించింది.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత టీడీపీ ఓటర్లు రేవంత్ రెడ్డిను ఓన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి వైపు ఉన్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పొత్తులో భాగంగా టీడీపీ ఓటర్లు బీజేపీకి ఓటు వేశారు. కానీ బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఏదో జరుగుతోందన్న వార్తలతో ఇప్పుడు అల్టిమేట్‌గా కాంగ్రెస్ వైపే షిఫ్ట్ అవుతున్నారు.

Advertisement

ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఇప్పటికీ చెప్పుకోదగ్గ ఓటర్లు ఉన్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్ ఏరియాలో టీడీపీకి ఓటర్లు ఉన్నారు. అందుకే ఏ మాత్రం ఛాన్స్ వదులుకోదలచుకోని బీజేపీ.. టీడీపీతో ఓ ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ వీళ్లంతా రేవంత్ రెడ్డి వెనుకే నడుస్తారని కొన్ని సర్వేలు కూడా చెబుతున్నాయి.

Related News

స్పీకర్ ఛాంబర్‌లో అత్యవసరంగా భేటీ.. గడ్డం ప్రసాద్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మేటరేంటి?

బీఆర్ఎస్‌ని ఏకేసిన మంత్రి సీతక్క.. మీది దళిత వ్యతిరేక నైజం, కవితను ఎందుకు బహిష్కరించారు?

Telangana Assembly: హరీష్‌రావుపై స్పీకర్ ఆగ్రహం.. నా తల్లిని తిట్టారు.. నాకు ఆవేశం ఉండాలి?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ అరెస్ట్, మిగతా నేతలపై..

స్పీకర్‌పై మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను: తాతా మధు!

జోగులాంబ గద్వాల్లో భూ బకాసురుల పంజా.. నకిలీ పట్టాలతో భూమి ఆక్రమణ!

ఈనెల 14 నుండి 25 వరకు తెలంగాణలో హై అలర్ట్!

దద్దరిల్లిన హన్మకొండ.. వేలాది మంది విద్యార్థులతో కవిత భారీ పాదయాత్ర!

Big Stories

Advertisement
×