E-Paper
Advertisement

Bhadrachalam : భద్రాచలంలో భక్తుల రద్దీ.. క్యూలైన్లలో బారులు తీరిన జనం..

Bhadrachalam : భద్రాచలంలో భక్తుల రద్దీ.. క్యూలైన్లలో బారులు తీరిన జనం..
Advertisement

Bhadrachalam : భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకంలో ఒకటైన పథకం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం నేపథ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది.

వైకుంఠ ఏకాదశి ముగిసినప్పటికీ నేడు, రేపు సెలవులు రావడంతో మహిళలు ఉచిత ప్రయాణం బస్సుల్లో భద్రాచలం రామయ్య దర్శనానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఇదిలా ఉండగా ప్రతి వారం సెలవు దినాల కంటే ఈ వారం సెలవు దినాలకు భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

మరోవైపు ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా నిత్య కల్యాణాలు ఆపివేయడం జరిగింది. ఈ రోజు నుంచి నిత్య కళ్యాణం పునః ప్రారంభించడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు కల్యాణం చేయించుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా ప్రసాదాలు రెగ్యులర్ కౌంటర్ మాత్రమే కాకుండా స్పెషల్ కౌంటర్లు పెట్టి ప్రసాదం లడ్డూలు విక్రయిస్తున్నారు. ప్రతి వారం సెలవు దినాల కంటే ఈ వారం సెలవు దినాలలో జనాల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడూ చేయించే 20 వేల లడ్డూల కంటే ఈ రోజు 40 వేల లడ్డూలుకు పైగా తయారు చేయిస్తున్నట్లు ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు.

Tags

Related News

కాంగ్రెస్ నాయకులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్!

Ramchander Rao: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులకు బిగ్ షాక్..?

‘ఎల్ నినో’తో ఎండిపోతున్న తెలంగాణ.. కాంగ్రెస్ నిద్రమత్తులో ఉందా? సీఎంకు దాసోజు శ్రవణ్ లేఖ!

రాహుల్ గాంధీ అరెస్ట్‌పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. ఏమన్నారంటే?

నా చావు కాలేజీకి చెప్పకండి.. సంతోషిస్తారు!.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టూడెంట్ సూసైడ్ నోట్!

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

ఉద్యమకారుల కోసం పోరాడి.. బీఆర్ఎస్‌లో బలయ్యాను.. కవిత సంచలన వ్యాఖ్యలు

Education Hub: మాటలు వద్దు.. హకీంపేటలో అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్!

Big Stories

Advertisement
×