E-Paper
Advertisement

Prices Increase: భారీగా పెరిగిన ధరలు.. సామాన్యుల నడ్డి విరుస్తోన్న నిత్యావసర ధరలు!

Prices Increase: భారీగా పెరిగిన ధరలు.. సామాన్యుల నడ్డి విరుస్తోన్న నిత్యావసర ధరలు!
Advertisement

Crude prices of essential commodities: దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే మంచి నూనెతోపాటు ఉల్లి ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి. తాజాగా, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, కందిపప్పు ఇలా నిత్యావసర సరుకులు సైతం పెరగడంతో సామాన్యుడికి రోజు గడవడం చాలా కష్టంగా మారింది.

ఒకవైపు కూరగాయల ధరలు, మరోవైపు నిత్యావసర సరుకులు పెరగడంతో మార్కెట్ వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. కూరగాయల ధరలు భగ్గుమంటుండగా.. ఆకాశన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు దిగిరానంటున్నాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తుండగా.. పెరిగిన ధరలు అదనపు భారం కావడంతో పస్తులుండాల్సి వస్తోంది.

Advertisement

నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటడంతో సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల టమోట ధరలు మోత మోగగా.. ప్రస్తుతం ఉల్లిగడ్డలు వంతు వచ్చింది. కొనకుండా.. కోయకుండానే కళ్లల్లో ఉల్లి నీళ్లు తెప్పిస్తుంది. ఇక, నిత్యావసర ధరలు కూడా ప్రస్తుతం ఆకాశన్నంటాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో నూనె ధరలు లీటర్‌పై రూ.20 నుంచి 45 వరకు పెరిగాయి. ఇక, అల్లం కిలో రూ.100 నుంచి రూ.150, వెల్లుల్లి రూ. 300 నుంచి 360, ఎండు మిర్చి రూ.200 నుంచి రూ.240, కందిపప్పు కిలో రూ.150 నుంచి రూ,175, పెసరపప్పు రూ. 30 పెరిగింది. దీంతో రూ. 150 వరకు ఉంది. ఇక మినపపప్పు రూ.135కి చేరగా.. ఉల్లి ధరలు కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతున్నాయి.

Advertisement

Also Read: కాసేపట్లో హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లొద్దు!

Related News

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

Big Stories

Advertisement
×