E-Paper
Advertisement

బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి సక్సెస్.. యశోద వైద్యుల అద్భుత విజయం!

బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి సక్సెస్.. యశోద వైద్యుల అద్భుత విజయం!
Advertisement

Kidney Transplant: స్వేచ్ఛ బ్యూరో: కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అసాధ్యంగా భావించిన పనిని సుసాధ్యం చేసినట్లు హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్ నెఫ్రాలజీ వైద్యులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

రక్తగ్రూపులు భిన్నంగా ఉన్న దాత-గ్రహీత మధ్య విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహించడం వైద్య రంగంలో అరుదైన ఘట్టమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్‌లో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సలో, ఆధునిక ‘ఏబీవో ఇన్‌కంపాటిబుల్ ట్రాన్స్‌ప్లాంట్’ పద్ధతిని అనుసరించి వైద్యులు రోగికి కొత్త జీవితం ప్రసాదించారు.

Advertisement

సాధారణంగా రక్తగ్రూప్ సరిపోకపోతే మార్పిడి సాధ్యం కాకపోయినా, ప్రత్యేక చికిత్సా విధానాలతో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ నెఫ్రాలజీ విభాగానికి చెందిన డాక్టర్ జశ్వంత్ మాట్లాడుతూ.. ‘కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అసాధ్యంగా భావించిన పనిని మేము సుసాధ్యం చేశాం. రక్తగ్రూప్ భిన్నత అడ్డంకి కాదని ఆధునిక వైద్య సాంకేతికత నిరూపించింది’ అని తెలిపారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది ఆశాకిరణంగా నిలుస్తుందని, సరైన వైద్య సలహా , సాంకేతికతతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Related News

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

Big Stories

Advertisement
×