E-Paper
Advertisement

బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి సక్సెస్.. యశోద వైద్యుల అద్భుత విజయం!

బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి సక్సెస్.. యశోద వైద్యుల అద్భుత విజయం!
Advertisement

Kidney Transplant: స్వేచ్ఛ బ్యూరో: కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అసాధ్యంగా భావించిన పనిని సుసాధ్యం చేసినట్లు హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్ నెఫ్రాలజీ వైద్యులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

రక్తగ్రూపులు భిన్నంగా ఉన్న దాత-గ్రహీత మధ్య విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహించడం వైద్య రంగంలో అరుదైన ఘట్టమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్‌లో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సలో, ఆధునిక ‘ఏబీవో ఇన్‌కంపాటిబుల్ ట్రాన్స్‌ప్లాంట్’ పద్ధతిని అనుసరించి వైద్యులు రోగికి కొత్త జీవితం ప్రసాదించారు.

Advertisement

సాధారణంగా రక్తగ్రూప్ సరిపోకపోతే మార్పిడి సాధ్యం కాకపోయినా, ప్రత్యేక చికిత్సా విధానాలతో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ నెఫ్రాలజీ విభాగానికి చెందిన డాక్టర్ జశ్వంత్ మాట్లాడుతూ.. ‘కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అసాధ్యంగా భావించిన పనిని మేము సుసాధ్యం చేశాం. రక్తగ్రూప్ భిన్నత అడ్డంకి కాదని ఆధునిక వైద్య సాంకేతికత నిరూపించింది’ అని తెలిపారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది ఆశాకిరణంగా నిలుస్తుందని, సరైన వైద్య సలహా , సాంకేతికతతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×