E-Paper
Advertisement

బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి సక్సెస్.. యశోద వైద్యుల అద్భుత విజయం!

బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి సక్సెస్.. యశోద వైద్యుల అద్భుత విజయం!

Kidney Transplant: స్వేచ్ఛ బ్యూరో: కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అసాధ్యంగా భావించిన పనిని సుసాధ్యం చేసినట్లు హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్ నెఫ్రాలజీ వైద్యులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

రక్తగ్రూపులు భిన్నంగా ఉన్న దాత-గ్రహీత మధ్య విజయవంతంగా కిడ్నీ మార్పిడి నిర్వహించడం వైద్య రంగంలో అరుదైన ఘట్టమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్‌లో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సలో, ఆధునిక ‘ఏబీవో ఇన్‌కంపాటిబుల్ ట్రాన్స్‌ప్లాంట్’ పద్ధతిని అనుసరించి వైద్యులు రోగికి కొత్త జీవితం ప్రసాదించారు.

సాధారణంగా రక్తగ్రూప్ సరిపోకపోతే మార్పిడి సాధ్యం కాకపోయినా, ప్రత్యేక చికిత్సా విధానాలతో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ నెఫ్రాలజీ విభాగానికి చెందిన డాక్టర్ జశ్వంత్ మాట్లాడుతూ.. ‘కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అసాధ్యంగా భావించిన పనిని మేము సుసాధ్యం చేశాం. రక్తగ్రూప్ భిన్నత అడ్డంకి కాదని ఆధునిక వైద్య సాంకేతికత నిరూపించింది’ అని తెలిపారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇది ఆశాకిరణంగా నిలుస్తుందని, సరైన వైద్య సలహా , సాంకేతికతతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×