BigTV English

MURDERS : హత్యలకు అడ్డాగా హైదరాబాద్.. వారం రోజుల్లో అరడజన్ కి పైగా మర్డర్స్..

MURDERS IN HYDERABAD : హైదరాబాద్ శివారు ప్రాంతాలు హత్యలు, ఆత్మహత్యలకు అడ్డాగా మారాయి. వారం రోజుల్లో అరడజనకు పైగా ఘటనలు వెలుగు చూశాయి. మంగళవారం ఒక్కరోజే మూడు ఘటనలతో నగరం ఉలిక్కి పడింది. బ్రాహ్మణపల్లి ఔటర్ రింగురోడ్డు దగ్గర మృతదేహం కలకలం రేపింది. గోనే సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఔటర్ రింగ్ రోడ్‌పై నుండి గుర్తుతెలియని వ్యక్తులు కిందకి పారేశారు. దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MURDERS : హత్యలకు అడ్డాగా హైదరాబాద్.. వారం రోజుల్లో అరడజన్ కి పైగా మర్డర్స్..

MURDERS : హైదరాబాద్ శివారు ప్రాంతాలు హత్యలు, ఆత్మహత్యలకు అడ్డాగా మారాయి. వారం రోజుల్లో అరడజనకు పైగా ఘటనలు వెలుగు చూశాయి. మంగళవారం ఒక్కరోజే మూడు ఘటనలతో నగరం ఉలిక్కి పడింది. బ్రాహ్మణపల్లి ఔటర్ రింగురోడ్డు దగ్గర మృతదేహం కలకలం రేపింది. గోనే సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఔటర్ రింగ్ రోడ్‌పై నుండి గుర్తుతెలియని వ్యక్తులు కిందకి పారేశారు. దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో మర్డర్ వార్త నగరాన్ని భయాందోళలకు గురి చేసింది. హైదరాబాద్ శివార అబ్దుల్లాపూర్‌మెట్‌‌లో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశారు. అత్యంత కిరాతకంగా తలను నరికేసి.. మొండాన్ని వేరు చేశారు. JNNURM కాలనీలో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు విజయ్‌ను.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మంగళవారం ఉదయాన్నే నార్సింగిలో ఓ వాచ్ మెన్ దారుణ హత్యకు గురైయ్యాడు. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో జంగయ్య అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అర్జున్ అనే తాపీ మేస్త్రి కూడా అక్కడే పనిచేస్తున్నాడు. బిల్డింగ్ యజమానికి తెలియకుండా అర్జున్ స్క్రాప్‌ను అమ్ముకుంటున్నాడు. ఈ విషయాన్ని వాచ్‌మెన్.. యజమానికి చెప్పాడు. దీంతో.. అర్జున్ మద్యం సేవించి ఆగ్రహంతో వాచ్‌మెన్ జంగయ్యను ఇనప కడ్డీతో తలపై బాది హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


రెండు రోజుల క్రితం వికారాబాద్‌లో ఓ మహిళ హత్యకు గురైంది. గుర్తుతెలియని మహిళపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. వికారాబాద్ జిల్లా గ్రామం పుల్ మద్ది శివారు పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మృతదేహాన్ని గుర్తించినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేరించారు. ఈ కేసు పోలీసులకు ఛాలెంజిగ్ గా మారింది. చనిపోయిన మహిళ ఎవరో తెలియదు.. చంపిన దుండగుల గురించి తెలియదు. ఎందుకు చంపారో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసును ఛేదించేందుకు తలమునకలై ఉన్న పోలీసులకు మంగళవారం వరుస ఘటనలు మరింత సవాల్ గా మారాయి. అటు.. వరుస హత్యలతో నగరవాసులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.

Related News

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Big Stories

×