E-Paper
Advertisement

Hyderabad Crime: కన్నతండ్రిని నడిరోడ్డుపై హత్య చేసిన కుమారుడు.. ఏకంగా 15 కత్తిపోట్లు..

Hyderabad Crime: కన్నతండ్రిని నడిరోడ్డుపై హత్య చేసిన కుమారుడు.. ఏకంగా 15 కత్తిపోట్లు..
Advertisement

Hyderabad Crime: కన్నతండ్రి పాలిట కన్న కొడుకే కాల యముడయ్యాడు. కత్తితో ఏకంగా 15 సార్లు పొడిచి తండ్రిని హత్య చేశాడు కుమారుడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కుషాయిగూడలో శనివారం మధ్యాహ్నం జరిగింది. హైదరాబాద్ లాలాగూడ ఇందిరానగర్ కు చెందిన ఆరేల్లి మొగిలి కి సాయికుమార్ అనే కుమారుడు ఉన్నాడు. సాయికుమార్ రోజూ మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధించేవాడు. ఈ క్రమంలో తరచూ ఇంట్లో ఘర్షణ వాతావరణం ఉండేది. సాయికుమార్ ఆగడాలను అరికట్టాలని తండ్రి మొగిలి పలుమార్లు ప్రయత్నించారు. కానీ సాయికుమార్ లో ఎటువంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన కుమార్.. తండ్రిపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.

అయితే శనివారం మధ్యాహ్నం తండ్రి, కొడుకు మధ్య ఎలా వివాదం చెలరేగిందో కానీ, ఏకంగా కత్తి పట్టుకొని సాయికుమార్ తన తండ్రి వెంటపడ్డాడు. కుషాయిగూడ వద్ద తండ్రి మొగిలి వెంటపడ్డ కుమార్ స్థానికులు చూస్తుండగానే కత్తితో దాడి చేశాడు. కుమారుడు కత్తితో దాడి చేస్తున్న క్రమంలో తప్పించుకునేందుకు పరుగులు పెట్టిన మొగిలి.. ఈసీఐఎల్ బస్ స్టాప్ వద్దకు చేరుకున్నాడు. అక్కడే మొగిలి పరుగులు పెట్టలేక ఆగిపోవడంతో సాయికుమార్ కత్తితో ఏకంగా 15 సార్లు పొడిచినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందింది. వెంటనే మొగిలిని శ్రీకర వైద్యశాలకు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

Advertisement

పోలీసులు కేసు నమోదు చేసి మొగిలి మృతదేహాన్ని గాంధీ వైద్యశాలకు తరలించారు. అలాగే తండ్రిని హత్య చేసిన కొడుకు సాయికుమార్ ను కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కన్న కొడుకు కాల యముడుగా మారి కన్నతండ్రిని కత్తితో 15 సార్లు పొడిచిన ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. అందుకే తమ పిల్లలపై ప్రేమతో పాటు తల్లిదండ్రుల నియంత్రణ కూడా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Also Read: సారీ చెప్పిన లోకల్ బాయ్ నాని.. డోంట్ రిపీట్ అంటూ సజ్జనార్ మళ్లీ వార్నింగ్

Advertisement

బాల్యం నుండే చెడు అలవాట్ల కలిగే అనర్ధాలను పిల్లలకు వివరించాలని, అలాగే కథల రూపంలో తల్లిదండ్రుల ప్రాముఖ్యత తెలిసేలా వివరించాల్సిన అవసరం ఉందని మేధావులు అంటున్నారు. యుక్త వయస్సు వచ్చాక మార్పు రావాలంటే రాదని, నేటి యువతపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా పిల్లల అలవాట్లపై ఓ కన్ను వేసి, వారిలో మార్పు తెచ్చేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×