E-Paper
Advertisement

‘అద్దె’కు హైదరాబాద్.. కేవలం 23 శాతం మాత్రమేనా? సర్వేలో షాకింగ్ విషయాలు!

‘అద్దె’కు హైదరాబాద్.. కేవలం 23 శాతం మాత్రమేనా? సర్వేలో షాకింగ్ విషయాలు!

Hyderabad City:  తెలంగాణలో జనాభా పెరుగుతోందా? ఉద్యోగాలకు హైదరాబాద్‌కు వలస వచ్చేవారి సంఖ్య పెరుగుతోందా? అత్యల్ప గృహ యాజమానుల రేటు నమోదు అయ్యిందా? భాగ్యనగరంలో కేవలం సొంత ఇంటికి కలిగినవారు నాలుగొంతుల్లో ఒక వంతు కూడా లేదా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ సిటీ గురించి షాకింగ్ న్యూస్

తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల-SEEEPC సర్వే-2024లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం తెలంగాణలో సొంత ఇళ్లు ఉన్న కుటుంబాల వాటా హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో అత్యల్పంగా నమోదు అయ్యింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యల్ప గృహ యాజమాన్య రేటు ఉన్నట్లు తేలింది. కేవలం 23.08 శాతం కుటుంబాలు మాత్రమే సొంత ఇంటిని కలిగి ఉన్నాయని అందులోని సారాంశం. ఇక సమీప జిల్లాలు మేడ్చల్-మల్కాజిగిరిలో అయితే 35.26 శాతం, రంగారెడ్డి జిల్లాలో 35.56 శాతంతో రెండు, మూడు అత్యల్ప జిల్లాలుగా నమోదు అయ్యాయి.

కేవలం 23 శాతం మాత్రమే సొంత గృహాలు కలిగినవారు

హైదరాబాద్ సిటీకి విరుద్ధంగా మిగతా జిల్లాలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో అత్యధికంగా 68.88 శాతం గృహ యాజమాన్యం ఉన్నారు. ఆ తర్వాత వనపర్తిలో 67.02 శాతం, జోగులాంబ గద్వాల్ జిల్లా‌లో 65.21 శాతం, నాగర్‌కర్నూల్‌లో 65.13 శాతం నమోదు అయ్యింది. యాదాద్రి భువనగిరిలో 64.86 శాతం ఉన్నట్లు తేలింది.

ఈ లెక్కన గృహ నిర్మాణాలు విషయంలో పట్టణ-గ్రామీణ ప్రాంతాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తున్నట్లు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గృహ యాజమాన్యం సర్ వసాధారణం ఉంటాయి. కాకపోతే హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో అద్దె ఇళ్ల వైపు గణనీయమైన మార్పు కనిపిస్తోంది.

ALSO READ: మట్టిలో కలిసిన రైతన్న బంగారం.. రాళ్ల వానకు రాలిపోయిన గింజలు

మొత్తానికి సర్వే ప్రకారం హైదరాబాద్‌లో అత్యధికంగా 70.63 శాతం కుటుంబాలు అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత మెడ్చల్-మల్కాజిగిరి 60.91 శాతంతో ఉంది. రంగారెడ్డి 59.71 శాతంతో సరిపెట్టుకుంది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల నివాసితుల్లో అధిక శాతం అద్దె ఇళ్లపై ఆధారపడుతున్నారు.

ఇతర జిల్లాల్లో అద్దె ఇళ్లలో నివసించేవారి సంఖ్య చాలా తక్కువ. ఇక నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 26.17 శాతం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 26.35 శాతం, వనపర్తిలో 29.11 శాతం, నాగర్‌కర్నూలులో 29.45 శాతం, మహబూబాబాద్ జిల్లాలో 30.32 శాతం అద్దె ఇళ్లు ఉన్నాయి.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×