హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కూకట్పల్లిలోని కేపీహెచ్బీ లూలూ మాల్ ఫ్లైఓవర్పై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సుల్తాన్ పాషా, షేక్ ఉమర్ అనే ఇద్దరు యువకులు రాత్రి సమయంలో R15 బైక్పై అతివేగంగా ప్రయాణిస్తున్నారు. లూలూ మాల్ ఫ్లైఓవర్పై బైక్ అదుపు తప్పడంతో వారు వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ కారును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదం ధాటికి బైక్పై ఉన్న యువకులు ఎగిరిపడ్డారు.
ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బైక్ నియంత్రణ కోల్పోయి వెనుక నుంచి వస్తున్న కారును ఢీకొట్టిన దృశ్యాలు మొత్తం ఫ్లైఓవర్పై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రమాదం జరిగిన తీరును ఈ దృశ్యాలు కళ్ళకు కట్టాయి.
కేపీహెచ్బీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి క్షతగాత్రుడి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను కూడా విచారిస్తున్నారు. అతివేగంతో వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి అంశాలపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువకులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.
ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రోడ్డు భద్రతపై అవగాహన లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం ఎంత ప్రమాదకరమో ఈ దుర్ఘటన మరోసారి గుర్తు చేసింది.
ALSO READ: Hyderabad: తొడల మధ్య రుద్దుకుంటూ.. కూరగాయల అమ్మకం, వ్యాపారి అరెస్ట్