E-Paper
Advertisement

Hyderabad Metro Issue: ఆగిన హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికులు హడల్.. ఆ తర్వాత?

Hyderabad Metro Issue: ఆగిన హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికులు హడల్.. ఆ తర్వాత?

Hyderabad Metro Issue: హైదరాబాద్ మెట్రో ట్రైన్ కాసేపు నిలిచి పోయింది. దీనితో మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పడిన హైరామా అంతా ఇంతా కాదు. చివరకు మెట్రో అధికారులు స్పందించడంతో సమస్య పరిష్కారమై, మెట్రో రైళ్ల రాకపోకలు యధావిధిగా సాగాయి. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ లో గురువారం జోరు వాన కురిసింది. ఉదయం నుండి ఎండ ప్రభావం ఉన్నప్పటికీ, మధ్యాహ్నం నుండి వాతావరణంలో స్వల్ప మార్పు కనిపించింది. కాగా సాయంత్రం ఒక్కసారిగా చిటపట చినుకులతో మొదలైన వర్షం, భారీ వర్షానికి దారి తీసింది. అంతేకాకుండా నగరంలోని పలు ప్రాంతాలలో వర్ష ప్రభావం అధికంగా కనిపించింది. పలు లోతట్టు ప్రాంతాలు జలకళను సంతరించుకున్నాయి.

అయితే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్ష సూచన ఉందని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. జిహెచ్ యంసి అధికారులు నాలాల వద్ద నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకున్నారు.

మెట్రో సేవలకు అంతరాయం.. ఆగిన మెట్రో రైలు
వర్షం కారణంగా హైదరాబాద్ మెట్రో రవాణాకు ఎఫెక్ట్ కనిపించింది. మియాపూర్ నుండి ఎల్బీ నగర్ రూట్‌లో వెళ్లే మెట్రో ట్రైన్ భరత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద నిలిచిపోయింది. ముందు సాధారణంగా మెట్రో ట్రైన్ ఆగిందని ప్రయాణికులు భావించారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ప్రయాణికులు గాబరా పడ్డారు.

సాంకేతిక సమస్య కారణంగా మెట్రో రైలు ఆగిందని తెలుసుకున్న ప్రయాణికులు ఆందోళన చెందగా, అదే తీరులో 20 నిమిషాల పాటు మెట్రోలో ప్రయాణికులు కాలం వెళ్లదీసిన పరిస్థితి. దీనితో సమాచారం అందుకున్న మెట్రో అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మెట్రో రైలు ద్వారాలు తెరిచారు. అలాగే మెట్రో రైలు రాకపోకలను పునరుద్ధరించారు.

Also Read: Gold Tiffin Box Theft case: నిజాం టిఫిన్ బాక్స్ చోరీ కేసు.. నిందితుడి హాబీ అదో వెరైటీ..

మొత్తం మీద మెట్రో రైలులో గల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడినట్లు తెలపడం విశేషం. ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా హైదరాబాద్ మెట్రో అధికారులు చర్యలు తీసుకోవాలని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు.

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×