E-Paper
Advertisement

Hyderabad Metro: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. మెట్రో వేళలు పొడిగింపు..

Hyderabad Metro: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. మెట్రో వేళలు పొడిగింపు..

Hyderabad Metro: హైదరాబాదీలకు మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. 45 రోజుల పాటు మెట్రో పనివేళలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నాంపల్లి గ్రౌండ్స్ లో 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకూ ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తారు. ఈ ఎగ్జిబిషన్ ను చూసేందుకు నగరం నలుమూలల నుంచి సందర్శకులు వస్తారు. సందర్శకుల తాకిడి నేపథ్యంలో.. మెట్రో పనివేళలను పెంచింది.

సందర్శకుల కోసం మెట్రో రైళ్ల వేళలను అర్థరాత్రి వరకూ పొడిగిస్తున్నట్లు మెట్రో యాజమాన్యం తెలిపింది. మియాపూర్ – ఎల్బీ నగర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైలు చివరి ట్రిప్ రాత్రి 12.15 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి 1 గంటకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. అలాగే నుమాయిష్ కు వెళ్లే ప్రయాణికుల కోసం మెట్రోస్టేషన్లలో స్పెషల్ టికెట్ కౌంటర్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు టీఎస్ ఆర్టీసీ కూడా నుమాయిష్ కోసం ప్రత్యేక బస్సుల్ని నడపనుంది. ఈ ఎగ్జిబిషన్ కు సుమారు 22 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. వారాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ.. మిగతా రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి 10.30 గంటల వరకు ఎంట్రీ ఉంటుంది. అలాగే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ వాహనాలతో లోపలికి వెళ్లొచ్చు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×