E-Paper
Advertisement

Hyderabad Metro: సాంకేతిక లోపంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు అవస్థలు

Hyderabad Metro: సాంకేతిక లోపంతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు.. ప్రయాణికులు అవస్థలు
Advertisement

Hyderabad Metro: ఎప్పుడూ రద్దీగా తిరిగే హైదరాబాద్ మెట్రో రైళ్లకు సాంకేతిక లోపం కారణంగా ఎక్కడికక్కడే మెట్రో రైళ్లు ఆగిపోయాయి. నాగోల్-రాయదుర్గం, LB నగర్-మియాపూర్ మార్గంలో అరగంట నుంచి ఎక్కడి ట్రెయిన్స్ అక్కడ ఆగిపోయాయి. బేగంపేట మెట్రో స్టేషన్ లో దాదాపు 15 నిమిషాల పాటు మెట్రో రైళ్లను ఆపేశారు. దీనికి కారణం సాంకేతిక లోపం అని అధికారులు తెలిపారు. అయితే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మెట్రో రైళ్లకు అంతరాయం ఏర్పడలేదు. 10 గంటల నుంచే సాంకేతిక లోపం కారణంగా ఎక్కడికక్కడే పలు రైళ్లు నిలిచిపోయాయని మెట్రో యాజమాన్యం తెలిపింది.

ఆఫీసులకు వెళ్లే సమయం కావడం.. రైళ్లు ఎంతకీ కదలకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. టెక్నికల్ ఇష్యూ వల్లన ఆగిపోయిన మెట్రో రైళ్లు.. త్వరలోనే యథావిధిగా తిరుగుతాయని మెట్రో అధికారులు వివరించారు. అయితే సాంకేతిక లోపానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మెట్రో ఆగిపోవడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. చాలా సార్లు ఇలాంటి సమస్యలు తలెత్తాయి. అయిన అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులు రద్దీ భారీగా పెరిగింది. ఇక అమీర పేట్ మెట్రో స్టేషన్‌లో అయితే చెప్పనవసరం లేదు. ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికు ఫ్లాట్ ఫామ్‌లపై నిరీక్షిస్తున్నారు.

Advertisement

Also Read: ప్ర‌భుత్వాసుపత్రుల‌పై సర్కార్ ఫోక‌స్..మందుల కొర‌తకు చెక్!

ఇదెలా ఉంటే..హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ ప్రభుత్వం భవిష్యత్ కార్యక్రమాలు చేపట్టబోతోంది. ఇందుకోసం కార్యాచరణ రెడీ అవుతోంది. నెక్ట్ లెవెల్ డెవలప్ మెంట్ ఏంటో చూపించబోతోంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ ల సమీక్షా సమావేశంలో ప్రభుత్వం కీలక సూచనలు ఇచ్చింది. మరోవైపు హైదరాబాద్ నగర వాసులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.

Advertisement

 

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×