E-Paper
Advertisement

Hyderabad News: చీకటిని చీల్చుకుంటూ వెళ్ళిన రెస్క్యూ టీమ్.. మీరాలం చెరువులో గల్లంతైన కార్మికులు సేఫ్

Hyderabad News: చీకటిని చీల్చుకుంటూ వెళ్ళిన రెస్క్యూ టీమ్.. మీరాలం చెరువులో గల్లంతైన కార్మికులు సేఫ్

Hyderabad News: హైదరాబాద్‌ పాతబస్తీలోని మీరాలం చెరువు వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగించింది. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం వచ్చిన తొమ్మిది మంది కార్మికులు చెరువు మధ్యలో చిక్కుకుపోవడంతో కలకలం రేగింది. పనులు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వీరంతా గల్లంతయ్యారు.

విశాఖపట్నం జిల్లాకు చెందిన సుమారు తొమ్మిది మంది కార్మికులు మీరాలం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ పనుల నిమిత్తం ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు చెరువులోకి వెళ్తుంటారు. యథావిధిగా ఆదివారం ఉదయం పనులకు వెళ్లిన వీరు.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పని ముగించుకుని తిరిగి గట్టుకు రావడానికి సిద్ధమయ్యారు. అయితే.. వారు ప్రయాణిస్తున్న బోటులో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో అది నీటి మధ్యలో నిలిచిపోయింది. చీకటి పడటం, గాలి వేగం పెరగడంతో కార్మికులు నీటిలో గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), స్థానిక పోలీసులు హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ.. రెస్క్యూ టీమ్స్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించారు. గల్లంతైన తొమ్మిది మంది కార్మికులను సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. వీరికి ప్రాథమిక చికిత్స అందించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×