Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలోని మీరాలం చెరువు వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగించింది. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం వచ్చిన తొమ్మిది మంది కార్మికులు చెరువు మధ్యలో చిక్కుకుపోవడంతో కలకలం రేగింది. పనులు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వీరంతా గల్లంతయ్యారు.
విశాఖపట్నం జిల్లాకు చెందిన సుమారు తొమ్మిది మంది కార్మికులు మీరాలం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ పనుల నిమిత్తం ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు చెరువులోకి వెళ్తుంటారు. యథావిధిగా ఆదివారం ఉదయం పనులకు వెళ్లిన వీరు.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పని ముగించుకుని తిరిగి గట్టుకు రావడానికి సిద్ధమయ్యారు. అయితే.. వారు ప్రయాణిస్తున్న బోటులో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో అది నీటి మధ్యలో నిలిచిపోయింది. చీకటి పడటం, గాలి వేగం పెరగడంతో కార్మికులు నీటిలో గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), స్థానిక పోలీసులు హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ.. రెస్క్యూ టీమ్స్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించారు. గల్లంతైన తొమ్మిది మంది కార్మికులను సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. వీరికి ప్రాథమిక చికిత్స అందించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
హైదరాబాద్ మీర్ ఆలం ట్యాంక్లో పడవ ఇంజిన్ విఫలమై, అర్ధరాత్రి చిక్కుకున్న 9 మంది కార్మికులను హైడ్రా DRF బృందాలు సురక్షితంగా రక్షించాయి. వంతెన నిర్మాణ మట్టి పరీక్షల కోసం వెళ్లిన వీరు, సరస్సులోని గుర్రపుడెక్క నాచు, మొసళ్ల భయం మధ్య గంటలపాటు ఆందోళన చెందారు. డయల్ 100 సమాచారంతో రంగంలోకి… pic.twitter.com/IBurmahTJr
— ChotaNews App (@ChotaNewsApp) January 26, 2026