Illegal Water Motors: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా జరుగుతుంది. సరఫరా జరిగే రోజున ఎక్కువ నీటిని తోడుకునేందుకు యజమానులు నల్లాలకు మోటార్లను బిగిస్తే ఇప్పటి వరకు వాటిని స్వాధీనం చేసుకున్న జలమండలి, ఇపుడు కఠిన చర్యలకు సిద్దమైంది. నల్లాలకు మోటారు బిగించే వారిని గుర్తించి, మోటార్లను స్వాధీనం చేసుకోవటంతో పాటు మోటార్లను భిగించిన వారికి రూ. 5 వేలను జరిమానాగా విధిస్తుంది. ఇలాగే పదేపదే చేస్తే కఠిన చర్యలు కూడా తీసుకోక తప్పదని జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు.
మంగళవారం ఉప్పల్ జోన్, డివిజన్- 4, బోడుప్పల్ వార్డులో ఉన్న శ్రీలక్ష్మీ నగర్ కాలనీ, ప్రశాంత్ గర్ పరిధిలో నల్లాకు బిగించిన మోటార్లును విజిలెన్సు అధికారులు నీటి సరఫరా సమయంలో పర్యటించి 12 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తామని, రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
Also Read: బీఆర్ఎస్ కారులో మళ్లీ పాత డ్రైవర్లే.. గుస్సా అవుతున్న కార్యకర్తలు
ఒకవేళ తక్కువ ప్రెజర్తో నీరు సరఫరా అయితే, నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తితే తమకు దగ్గరలోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలని, లేక జలమండలి కస్టమర్ కేర్ నెంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు.
Also Read: తెలుగువన్ ప్రొడక్షన్స్లో రెండో సినిమా షురూ.. దర్శకుడిగా కంఠంనేని రవిశంకర్!