Drug Bust: పక్కాగా సేకరించిన సమాచారం ప్రకారం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు సంజీవరెడ్డినగర్ పోలీసులతో కలిసి ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు పెడ్లర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 35లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ మహ్మద్ ఇక్భాల్ సిద్దిఖీ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన సునీల్ దలబెహరా (30) రైతు. తేలికగా డబ్బు సంపాదించేందుకుగాను కొంతకాలంగా గంజాయి సాగు చేస్తున్నాడు.
Also Read: Hydra: రూ. 1003 కోట్ల విలువైన సర్కారు భూమిని కాపాడిన హైడ్రా!
అదే రాష్ట్రానికి చెంది ప్రస్తుతం మేడ్చల్ లో ఉంటూ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తున్న ఇస్మాయిల్ రైతా (46)తో అతనికి బంధుత్వం ఉంది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి హైదరాబాద్ లో గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారం 70కిలోల గంజాయిని హైదరాబాద్ తీసుకొచ్చారు. దానిని ధూల్ పేటలోని లోకల్ పెడ్లర్లతోపాటు గంజాయి అలవాటు పడ్డవారికి అమ్మాలనుకున్నారు. ఈ మేరకు సమాచారం అందటంతో టాస్క్ ఫోర్స్ సీఐ చౌదరి యదేంధర్, ఎస్ఐ రవిరాజ్ తోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం సంజీవరెడ్డినగర్ పోలీసులకు అప్పగించారు.
Also Read: Tandur Politics: తాండూరు చైర్మన్ ఎవరికి దక్కుతుందో? మాటల తూటాలతో రచ్చకెక్కుతున్న నేతలు!