E-Paper
Advertisement

Hydra Demolishing: మియాపూర్‌లో హైడ్రా దూకుడు.. ఐదు అంతస్తులు చూస్తుండగానే నేలమట్టం

Hydra Demolishing: మియాపూర్‌లో హైడ్రా దూకుడు.. ఐదు అంతస్తులు చూస్తుండగానే నేలమట్టం
Advertisement

Hydra Demolishing: హెచ్ఎండీఏ కు చెందిన భూముల ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. మియాపూర్ సర్వేనెంబర్ 100లో భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని హైడ్రా శనివారం కొనసాగించింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగర పరిధిలోని మియాపూర్‌లో.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 5 అంతస్తుల భవనం నిర్మించిన భాను కన్స్ట్రక్షన్స్ యజమానులపై హైడ్రా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. సుమారు 873 గజాల భూభాగంలో, అందులో 473 గజాలు ప్రభుత్వ భూమి గా గుర్తించడంతో, హైడ్రా అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేశారు.

Advertisement

ప్రాథమిక సమాచారం ప్రకారం.. భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు అమీన్పూర్‌లోని సర్వే నంబర్లు 337, 338లో ఉన్న HUDA అప్రూవ్డ్ లే అవుట్‌లో 400 గజాల 126 నెంబర్ ప్లాట్ కొనుగోలు చేశారు. అయితే ఆ ప్లాట్ పక్కనే ఉన్న మియాపూర్ సర్వే నంబర్ 101, ఇది ప్రభుత్వానికి చెందిన HMDA భూమి. 126/D, 126/part, 126/C పేర్లతో కొత్త ప్లాట్లు సృష్టించి, వాటిని వ్యక్తిగత స్వామ్యంగా చూపుతూ 5 అంతస్తుల భవనం నిర్మించారు.

2014లోనే భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఫేక్ LRS పత్రాలు సృష్టించినట్లు హైడ్రా విచారణలో బయటపడింది. LRS చెల్లింపుల కోసం చూపించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD) కూడా నకిలీదేనని గుర్తించారు. ఈ అక్రమ లావాదేవీలను గుర్తించిన తరువాత, అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.

Advertisement

HMDA అధికారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, హైడ్రా ప్రత్యేక బృందం రెవెన్యూ, మున్సిపల్, HMDA అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసింది. సర్వే నంబర్ 101లోని సరిహద్దులను సరిగ్గా గుర్తించి, ప్రభుత్వ భూమిలోకి జరిగిన నిర్మాణాన్ని స్పష్టంగా గుర్తించారు. సాక్ష్యాలు, రికార్డులు, ఫీల్డ్ మ్యాపింగ్ ఆధారంగా మొత్తం 473 గజాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణం జరిగినట్టు తేలింది.

Also Read: కాశీబుగ్గలో తొక్కిసలాట.. 9 మంది మృతి..

అన్నీ నిర్ధారించుకున్న అనంతరం, హైడ్రా అధికారులు శనివారం కూల్చివేత చర్యలు చేపట్టారు. జేసీబీలు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ బందోబస్తుతో కలిసి ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ఆక్రమణ స్థలంలో ఎవరూ అడ్డంకులు సృష్టించకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×