E-Paper
Advertisement

HYDRAA: మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ. 3,000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

HYDRAA: మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ. 3,000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
Advertisement

HYDRAA: హైదరాబాద్‌లో కబ్జాదారుల పీడకల ‘హైడ్రా’ మరోసారి విరుచుకుపడింది. మియాపూర్ వేదికగా భారీ ఆపరేషన్ చేపట్టిన హైడ్రా అధికారులు.. సుమారు 3 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించారు.

మియాపూర్ మక్తా మహబూబ్‌పేటలోని సర్వే నంబర్ 44లో ఈ భారీ ఆపరేషన్ కొనసాగింది. గతంలో ప్రజావాణికి అందిన ఫిర్యాదుల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. తప్పుడు పత్రాలు సృష్టించి సుమారు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రను హైడ్రా భగ్నం చేసింది. ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు పడగా.. తాజాగా 15 ఎకరాల భూమిని హైడ్రా తన ఆధీనంలోకి తీసుకుంది.

Advertisement

గతంలోనే ఇదే ప్రాంతంలో 5 ఎకరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. తాజాగా మరో 15 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 159 పత్రాలతో సర్వే నంబర్ 44లోని భూమిని కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. చెరువు కట్టలపై వెలిసిన అక్రమ షెట్టర్లను సైతం నేలమట్టం చేసి.. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో హైడ్రా రాజీపడబోదని మరోసారి నిరూపించింది.

ALSO READ: గాలిపటం ఎగరవేస్తుండగా కరెంట్ షాక్.. ఐదేళ్ల బాలుడు మృతి

Advertisement

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×