E-Paper
Advertisement

HYDRA: రూ. 1511 కోట్ల భూములు సేఫ్.. ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో హైడ్రా బిగ్ ఆపరేషన్లు!

HYDRA: రూ. 1511 కోట్ల భూములు సేఫ్.. ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో హైడ్రా బిగ్ ఆపరేషన్లు!
Advertisement

HYDRA:  చెరువులు, కుంటలు, పార్కుల్లోని ఆక్రమణలపై హైడ్రా సీరియస్ గా స్పందించింది. సిటీలోని నాలుగు ప్రాంతాల్లో బిగ్ ఆపరేషన్లు నిర్వహించిన హైడ్రా మొత్తం రూ. 1511 కోట్ల విలువైన భూములను కాపాడింది. పార్కులు, చెరువుల‌ను చెర‌ప‌ట్టిన వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. భూములను కాపాడటంతో పాటు మున్ముందు కబ్జాలకు గురి కాకుండా ఆక్రమణలు రాకుండా వెంట‌నే ఫెన్సింగ్ కూడా వేసింది. రెండు చోట్ల 1100 గ‌జాల మేర ఉన్నపార్కుల‌ను కాపాడ‌గా, మ‌రో రెండు ప్రాంతాల్లో 1100 ఎక‌రాల మేర‌ చెరువుల ఎఫ్‌టీఎల్ ప్రాంతాల‌ను హైడ్రా ర‌క్షించిందని హైడ్రా అధికారులు వెల్లడించారు. కాపాడిన భూముల విలువ సుమారు రూ. 1511ల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని కూడా హైడ్రా అంఛనాలేసింది.

కొండాపూర్‌లో చెరువును కాపాడిన హైడ్రా

శేరిలింగంప‌ల్లి మున్సిప‌ల్ కార్యాల‌యం, మ‌దీనాగూడ రోడ్డు మార్గం కొండాపూర్‌లో రూ. 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది. 4 ఎక‌రాల జంగం కుంట‌ను పూడ్చేసి, మ‌ట్టితో చ‌దును చేసి ప్లాట్లుగా విక్ర‌యించేందుకు సిద్ధ‌మైన క‌బ్జాదారుల ఆట క‌ట్టించింది. ఇటీవ‌ల మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల మేర‌కు రెవెన్యూ అధికారుల‌తో హైడ్రా జాయింట్ ఇన్‌స్పెక్ష‌న్ చేసింది. జంగం కుంట‌గా హైడ్రా నిర్ధారించుకుంది. క‌బ్జా చేసిన వారిపై రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు. హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం ఫెన్సింగ్ వేసింది.

Advertisement

Also Read: Hydra operation: హైడ్రా మెరుపు దాడి: రూ. 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కోరల నుంచి విముక్తి

అల్వాల్ కొత్త చెరువులో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు

మేడ్చ‌ల్ – మ‌ల్కాజ్ గిరి జిల్లా అల్వాల్ మండ‌లంలోని అల్వాల్ కొత్త చెరువు 8 ఎక‌రాల మేర ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్‌, ప్లాస్టిక్ వ్య‌ర్థాల సేక‌ర‌ణ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తూ చెరువును క‌లుషితం చేస్తున్నార‌ని స్థానికులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. అక్క‌డ ప‌ని వారి కోసం తాత్కాలిక షెడ్డులు వేసి వ్య‌ర్థాల‌న్నీ చెరువులోకి వ‌దులుతున్నార‌ని పేర్కొన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని టెంటు సామ‌గ్రీకి చెందిన 4 ష‌ట్ట‌ర్లు కూడా వేసిన‌ట్టు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్ధారించుకున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఎలాంటి క‌ట్ట‌డాలు, నిర్మాణాలు చేయ‌రాద‌నే నిబంధ‌నను పాటించకుండా ఏర్పాటు చేసిన షెడ్డుల‌ను హైడ్రా తొల‌గించింది.

1100 గ‌జాల పార్కుల‌ను కాపాడిన హైడ్రా

Advertisement

రంగారెడ్డి జిల్లా వ‌న‌స్థ‌లిపురం సాహేబ్‌న‌గ‌ర్ క‌లాన్‌లోని జ‌క్కిడిన‌గ‌ర్ కాల‌నీలో 650 గ‌జాల పార్కు స్థ‌లాన్ని హైడ్రా మంగళవారం కాపాడింది. సర్వే నెంబ‌రు 132, 133లో 1982లో 12 ఎక‌రాల మేర దాదాపు 161ప్లాట్ల‌తో జ‌క్కిడి కుటుంబ స‌భ్య‌లు లే ఔట్ వేశారు. ఇందులో 650 మేర పార్కుకోసం కేటాయించారు. 1985లోనే దీనిని ప్లాట్లుగా చేసి లే ఔట్ వేసిన వారే అమ్మేశార‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ప్ర‌హ‌రీతో పాటు రెండు షెడ్డులు నిర్మించారు. ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు క్షేత్ర‌స్థాయిలో హైడ్రా ప‌రిశీలించి పార్కు స్థ‌లంగా నిర్ధారించుకుంది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థ‌లంగా పేర్కంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. మ‌ల్కాజ్ గిరి జోన్‌, మౌలాలి స‌ర్కిల్ ప‌రిధిలోని కాక‌తీయ న‌గ‌ర్‌లో రాథాకృష్ణ హౌసింగ్ కాల‌నీలో 450 గ‌జాల పార్కును హైడ్రా కాపాడింది. జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన ఈ పార్కు స్థలాన్ని ఆక్ర‌మించి నిర్మించిన ప్ర‌హ‌రీతో పాటు రేకుల షెడ్డును హైడ్రా మంగ‌ళ‌వారం తొల‌గించింది.

Also Read:HYDRAA: రూ.1511cr విలువైన భూమి సేఫ్.. ఇది కదా హైడ్రా పవర్ అంటే, ఎలా సేవ్ చేశారంటే..? 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×