Malla Reddy Rangareddy: స్వేఛ్చ బ్యూరో: గత ప్రభుత్వంలో ద్వీపం కింద చీకటిగా పారిపాలన సాగిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి(MLA Mal Reddy Rangareddy) విమర్శించారు. నియోజకవర్గ కేంద్రమైన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని అన్నిహంగులతో సౌకర్యవంతమైన ఆసుపత్రిని నిర్మిస్తామని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇబ్రహీంపట్నంలోని చెరువును మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆరు మంది మహిళాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలమై మరణించారని గుర్తు చేశారు.
మున్సిపాలిటీని రూ.225 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపోందించామని తెలిపారు. గత 15 యేండ్లు ఇబ్రహీంపట్నం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మేజార్టీతో గెలిపోంది చూపిస్తానని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. యాచారం మండలంలో రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిన బీఆర్ఎస్ నేతలు కోర్టు చూట్టు తిరుగుతున్నారని విమర్శించారు. వెలిమినేడులో కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు.
Also Read: iQOO 15 Ultra: 144Hz డిస్ప్లే, కూలింగ్ ఫ్యాన్, 24GB RAMతో కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?
ఫార్మాసిటీ పేరుతో దేవాలయం భూములను ప్రభుత్వం తీసుకుంటే రైతులందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మల్టిప్లేక్స్ కమర్షియల్ బిల్లింగ్ను ఏడాది పాటు నిర్మాణం చేయకుండా నిలిపివేసిన చరిత్ర బీఆర్ఎస్ నేతలు కాదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇబ్రహీంపట్నం రూపు రేఖలు మార్చి చూపిస్తామని ప్రజలకు మల్ రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు.
Also Read: Sree Leela: తల్లికి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన శ్రీలీల.. ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ!