MLA Malreddy Rangareddy: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేగా గెలిపోందానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Rangareddy)అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కచ్చితంగా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అన్నారు. మున్సిపాలిటి ఎన్నికల ప్రచారం ముగింపు కార్యక్రమంలో ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు. మంత్రి పదవి ఇవ్వడానికి రిజర్వేషన్ సమీకరణం అడ్డువస్తుందటే రాజీనామాకు సిద్దమంటూ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగంగా మల్ రెడ్డి ప్రసంగించారు.
కచ్చితంగా నాకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని అడుగుతాను… ఆ నిర్ణయం వాళ్లదేనని అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 24 వార్డులను హస్తం గుర్తు అభ్యర్ధులే గెలుస్తారని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్ధులే ముందంజలో ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయని వివరించారు. గత 15 యేండ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఏమీ అభివృద్ధి చేశారని మల్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానాను 100 పడకలకు పెంచానని తెలిపారు. ఇప్పటి వరకు పట్టణాభివృద్ధి కోసం రూ.200కోట్లు ఖర్చుచేశానని అన్నారు. నామీద ఒక్క అవినీతి ఆరోపణ లేదని, ప్రభుత్వ భూములతో పాటు డిపో వెనుకనున్న భూమిని దోచుకున్నారని ఆరోపించారు.