E-Paper
Advertisement

సర్కారు బడికి కార్పొరేట్ కష్టాలు.. నిబంధన ఉచ్చులో 11 స్కూళ్లు..!

సర్కారు బడికి కార్పొరేట్ కష్టాలు.. నిబంధన ఉచ్చులో 11 స్కూళ్లు..!

School Upgrade: కర్పోరేట్ స్ధాయిలో సర్కారీ స్కూళ్లు
–క్యూర్​ అర్బన్​ రీజియన్​ పరిధిలోని
–రాష్ట్రంలో 11 స్కూళ్లు అప్​గ్రేగేడ్​
–రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాలోనే అత్యధికం
–ఎకరానికి పైగా ఉన్న స్కూళ్లనే ఎంపిక 

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: రాష్ట్రంలో సర్కారి బడులను పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దశల వారీగా విద్యా వ్యవస్థను ప్రక్షాళిన చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగానే వచ్చే ఏడాదిలో మరో 11 ప్రభుత్వ స్కూల్స్​ను ఇంటర్​ దాకా అప్​గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు స్కూల్స్​ను అప్​గ్రేడ్​ చేసి సక్సెస్​ దిశగా నడిపిస్తుంది. రంగారెడ్డి, నాగర్​ కర్నూల్ జిల్లాలో మూడు ప్రభుత్వ స్కూల్స్​ను ఇంటర్​ వరకు అప్​గ్రేడ్​ చేసి సకాల సౌకర్యాలతో నడిపిస్తుంది. ఈ స్కూల్స్​ను తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్​) నామాకరణం చేయడం జరిగింది. ఇదే తరహాలో మరిన్ని స్కూల్స్​కు అప్​గ్రేడ్​కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అప్​గ్రేడ్​ స్కూల్​ విస్తీర్ణం ఎకరంపైనే..

ఫ్రీ–ప్రైమరి నుంచి ఇంటర్మీడియేట్​ వరకు ఒకే ప్రాంగణంలో విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ స్కూల్ అప్గ్రేడ్ ప్రభుత్వానికి భూ విస్తీర్ణం సవాల్​గా మారిపోయింది. తక్కువలో తక్కువగా ఎకరం స్థలం ఉండాల్సిందేననే నిబంధన పెట్టుకున్నారు. దీంతో కొన్ని ప్రభుత్వ స్కూల్స్​ అర ఎకరం విస్తీర్ణం లేని స్కూల్స్ కూడా ఉండటంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోయింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకోని మొదటగా స్కూల్​ ఎంపిక చేసిన తరువాత స్థల సేకరణపై దృష్టి పెట్టాలని భావిస్తుంది. అందుకు అనుగుణంగా కొర్​ అర్బన్​ రీజియన్​ పరిధిని పరిమితంగా పెట్టుకొని స్కూల్స్​ను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన 11 ప్రభుత్వ స్కూల్స్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే అధికంగా ఉండటం గమనార్హం.

రింగు రోడ్డులే హద్దుగానే రీజియన్​..

రాష్ట్ర ప్రభుత్వం మూడు రీజియన్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. ఔటర్​ రింగు రోడ్డు వరకు కోర్​ అర్బన్​, రీజినల్​ రింగు రోడ్డు వరకు అర్బన్​ , ఆతర్వాత ప్రాంతమంతా రూరల్​ రీజియన్​గా విభజిస్తూ పరిపాలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా రింగు రోడ్డుల హద్దుగా ప్రాంతాల అభివృద్ధికి సీఎం కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. విద్య వ్యవస్థను అదే పద్దతిలో అభివృద్ధికి ప్రణాళిక చేశారు. కోర్​ అర్బన్​ రీజియన్​ ఔటర్​ రింగు రోడ్డు లోపలున్న ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్ధులకు నాణ్యమైన విద్య అంధించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటి విడుతలో అర్బన్​ రీజియన్​లో మూడు స్కూల్స్​ను ఎంపిక చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు కోర్​ అర్బన్​ ప్రాంతాల్లో 11 స్కూల్స్​ ఎంపిక చేసి ముందుకు సాగుతున్నారు.

Also read: Tax Disparity: బీజేపీ యేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ: మంత్రి జూపల్లి

కార్పోరేట్​ స్ధాయిలో స్కూల్స్​..

రాష్ట్రంలో దశల వారీగా ప్రభుత్వ స్కూల్స్​ రూపురేఖలను మార్చాలనే సంకల్పంతో సర్కార్​ ముందుకు పోతుంది. పిల్లల చదువు కోసం పేద, మధ్య, ధనిక అనే తేడా లేకుండా అప్పులు చేసి చదివిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు పిల్లల చదువు కోసం అనేక కష్టాలు పడుతున్నారు. ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోని అడుగులు వేస్తోంది. కార్పోరేట్​ స్ధాయికి దీటుగా స్కూల్స్​ ఉండాలని ప్రభుత్వం 23 స్కూల్స్​ను ఎంపిక చేసింది. ఆ స్కూల్స్​లో డిజిటల్ క్లాస్​ రూమ్స్​, కంప్యూటర్​ లాబ్స్​, విశాలమైన తరగతి గదులు, లైబ్రరీ, క్రీడాల వంటివి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్​, లైబ్రరీయన్​తో పాటు నాన్ టీచింగ్​ సిబ్బందిని సైతం కాంట్రాక్ట్​ పద్దతిలో నియామకం చేసుకుంటున్నారు. అయితే 23 స్కూల్స్​ను హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాలో ఎంపిక చేశారు.

స్తల సేకరణ..

ఇందులో 12 ప్రాంతాల్లో నూతన భవనాలు నిర్మిస్తున్నారు. అయితే 11 స్కూల్స్లో హైస్కూళ్లు, జూనియర్​ కాలేజీలుగా అప్​గ్రేడ్​ చేస్తు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన స్కూల్స్లో తగినంత స్థలం లేకపోవడంతో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల పరిధిలోని బాచుపల్లి, అమీర్​పేట్​, మారేడ్​పల్లి, బండ్లగూడ, సరూర్​నగర్​, బాలాపూర్​ తదితర స్కూల్​కులకు అవసరమైన స్థలం సేకరించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు సమాచారం. స్తల సేకరణ పూర్తైన వెంటనే నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచంచింది. ఈ స్కూల్స్​ నిర్మాణం, అప్​గ్రేడ్​కు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు రూ.587 కోట్లు అవసరమైతాయని ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపారు.

ఎంపికైన స్కూల్స్​ ఇవే..

హైదరాబాద్​లో ఆరు స్కూల్స్​ను ఎంపిక చేశారు. అమీర్​పేట్​, ఖైరతాబాద్​, మారేడ్​పల్లి, కందికల్ గేట్​, హాపీజ్ బాబా నగర్​, ధూల్పేట ప్రభుత్వ స్కూల్స్​. రంగారెడ్డి జిల్లాలో 11 స్కూళ్సలో లింగోజిగూడ, సరూర్​నగర్​, లక్ష్మిగూడ (రాజేంద్రనగర్​), కిస్మత్పూర్​, బాలాపూర్​, రాందాస్​పల్లి, బాగ్​ హయత్​నగర్​, చందానగర్​, భూపేష్​ గుప్తా నగర్​, జల్​పల్లి, గౌలిదొడ్డిలో.. మేడ్చల్​లో నాలుగు స్కూల్స్​ పాతుల్లగూడ (ఉప్పల్​), పోచారం, బాచుపల్లి, గాజులరామారంలో… సంగారెడ్డిలొ అమీన్​పూర్​, కొల్లూరు స్కూల్​ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో కొన్ని స్కూల్స్ నిర్మాణంలో ఉండగా, మరికొన్ని స్కూల్స్ నిర్మాణం పూర్తై అప్​గ్రేడ్​ చేసినట్లు అధికారులు వివరిస్తున్నారు.

Also read: కల్తీ గ్యాంగులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్.. నెక్స్ట్ టార్గెట్..?

Related News

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Big Stories

×