Aliabad Municipality: స్వేచ్ఛ బ్యూరో: అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మేకల పద్మ నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నేడు ఘనంగా ప్రారంభించారు. మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని తెలిపారు.
ఇళ్లులేని నిరుపేదలకు గృహసౌకర్యం కల్పించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతుందని, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతాయని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ శిరీష కృష్ణ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల సహకారంతో పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు.
Also Read: Upcoming EV Cars Mar 2026: టాటా సియెర్రా EV To మహీంద్రా XUV.e8.. మార్చిలో లాంచ్ కాబోయే క్రేజీ ఈవీలు!
ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణు గోపాల్ రెడ్డి ,కౌన్సిలర్లు మౌనిక బాబు, జశ్వంత్ రెడ్డీ, ఆర్ టీ ఏ జిల్లా సభ్యుడు జైపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పప్పుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసి అశోక్ రెడ్డి. నర్సింగ్ రావు, బాలకృష్ణ, పింగి నవీన్ రెడ్డి, యాదగిరి, దినేష్,కృష్ణ, బాలేష్ కుటుంబ సభ్యులు మాధవి, మహేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.