Student Suicide: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఇంటర్ (ఎస్ఎంఎస్) ఎస్సీ హాస్టల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బైపీసీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అమృత హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డిన ఘటన చోటుచేసుకుంది. తండ్రి మైసయ్య తల్లి రామలకు చెందిన కూతురు అమృత విద్యార్థి స్వగ్రామం డోంగ్లీ మండలం లక్ష్మాపూర్ గ్రామంగా చెందినవారుగా గుర్తించారు ఘటన సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్కు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విషయం తెలుసుకున్న బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి హాస్టల్కు చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. సంబంధి అధికారులు, హాస్టల్ సిబ్బందితో మాట్లాడి ఘటనకు దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరించారు. విద్యార్థి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ చిన్నారి అభిమాని నిరంజన్ మృతి!
ఈ సందర్భంగా ఆర్డీఓ రవీందర్ రెడ్డి విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడి ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన విరమించగా, అనంతరం విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ వార్డెన్ విద్యార్థికీ 10.000 చెల్లించాల్సిందిగా విద్యార్థికి అడిగినట్లు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆరోపణ చేస్తున్నారు. వార్డెన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.