E-Paper
Advertisement

JR NTR Approaches High Court: ల్యాండ్ వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరో ఎన్టీఆర్..!

JR NTR Approaches High Court: ల్యాండ్ వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరో ఎన్టీఆర్..!
Advertisement

Jr. NTR Approached Telangana High Court on Land Dispute: ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. ఓ ల్యాండ్ వివాదంపై హై కోర్టును ఆశ్రయించారు. సుంకు గీతలక్ష్మి అనే మహిళ నుంచి 2003లో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ సమయంలో స్థలంపై ఒక బ్యాంకులో లోన్ ఉన్నట్లు చెప్పింది గీత. దానిని క్లియర్ చేసి.. స్థలాన్ని కొనుగోలు చేశారు ఎన్టీఆర్. కానీ ఆ తర్వాత 3,4 బ్యాంకులు తమ వద్ద లోన్ తీర్చకపోవడంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. గీత ఫేక్ డాక్యుమెంట్లతో ఆయా బ్యాంకుల నుంచి మార్ట్ గెజ్ ద్వారా లోన్ పొందింది.

ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ 2019లో ఆయా బ్యాంకుల మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1996లో ఈ స్థలాన్ని తనఖా పెట్టి ఒక బ్యాంకులో మాత్రమే లోన్ తీసుకున్నట్లు చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 1996లోనే తమ వద్ద గీతలక్ష్మి స్థలం పేపర్లు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నట్లు బ్యాంకులు ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా.. బ్యాంకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

Advertisement

తనను మోసం చేసి స్థలం విక్రయించారని సుంకు గీతలక్ష్మి పై జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఎన్టీఆర్ కు DRT రావడంతో హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 3 లోగా DRT డాకెట్ ఆర్డర్ ను సబ్మిట్ చేయాలని హై కోర్టు ఆదేశించింది. దీనిపై జూన్ 6వ తేదీన విచారణ చేపట్టనుంది.

Also Read: జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వైరలవుతున్న వీడియో

Advertisement

కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. రెండు పార్టులుగా వస్తోన్న దేవర.. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా రూపొందుతోంది. మరోవైపు హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న వార్ 2 లోనూ ఎన్టీఆర్ నటిస్తున్నారు.

Related News

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

Big Stories

Advertisement
×