Kavitha: స్వేచ్ఛ బ్యూరో: జీవో 25 రేషనలైజేషన్ తో సంబంధం లేకుండా 190 జీవో అమలు చేయాలని, అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్న గుండె ధైర్యం లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు.
ఉద్యమకారుల విషయమైన ఉద్యోగుల విషయమైన సరే కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. 317 జీవో కు సంబంధించి దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కేబినెట్ సబ్ కమిటీ వేసిందని, ఆ కమిటీ 317 ను సవరిస్తూ మధ్యంతరంగా 190 జీవోను తెచ్చిందన్నారు. తొమ్మిది నెలలు గడిచిన సరే ఇప్పటి వరకు కూడా ఆ జీవోను అమలు చేయటం లేదని మండిపడ్డారు. ఎవరి కోసం, ఏ పైరవీల కోసం జీవోను అమలు చేయటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను స్థానికంగా బదిలీ చేస్తామని చెప్పి వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు.
317 జీవో బాధితుల్లో ఎక్కువగా టీచర్లతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులు ఉన్నారన్నారు. వారిని స్వస్థలాలకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పారన్నారు. జీవో గడువు మూడేళ్లు మాత్రమే ఉంటే ఇప్పటి వరకు ఒక్కరినీ కూడా బదిలీ చేయలేదన్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. వారికి అండగా తెలంగాణ రక్షణ సేన ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు, టీచర్ల హక్కుల కోసం వారి తరఫున మేము పోరాడుతామని తెలిపారు. వెంటనే 190 జీవో ను అమలు చేయాలని, లేదంటే తెలంగాణ రక్షణ సేన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also Read: కేశినేని బ్రదర్స్ ‘ఈడీ’ వార్.. అన్న వేసిన ప్లాన్కు తమ్ముడు డిఫెన్స్లో పడతాడా?
జీవో 190ని వెంటనే అమలు చేయాలి: కవిత
కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విఫలమైందని టీఆర్ఎస్ అధినేత్రి కవిత మండిపడ్డారు. జీవో 317 బాధితులకు న్యాయం చేసేందుకు తెచ్చిన జీవో 190ని తెచ్చి 9 నెలలైనా ఎందుకు అమలు చేయలేదని, సూపర్ న్యూమరీ పోస్టుల… pic.twitter.com/SrzgfPABRi
— BIG TV Breaking News (@bigtvtelugu) June 12, 2026