E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పవన్ కళ్యాణ్‌కు.. తెలంగాణలో ఏం పని.. మళ్లీ విరుచుకుపడ్డ కవిత

పవన్ కళ్యాణ్‌కు.. తెలంగాణలో ఏం పని.. మళ్లీ విరుచుకుపడ్డ కవిత
Advertisement

Kalvakuntla Kavitha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మరోమారు నిప్పులు చెరిగారు. హైదరాబాద్ మణికొండలో జనసేన కార్యాలయాన్ని పవన్ ప్రారంభించిన నేపథ్యంలో.. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు తెలంగాణలో మీకేం పని అంటూ పవన్ ను నిలదీశారు. సినిమాల ముసుగులో వచ్చి తెలంగాణను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన సినిమాలు చూసి సంతోషిస్తాం కానీ సెక్రటేరియట్ వైపు చూస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు.

వరంగల్ జిల్లాలో పర్యటన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్నందున ఆ రాష్ట్రంలో రాజకీయాలు చేసుకోవాలని కవిత సూచించారు. ఇక్కడ సినిమాలు తీసుకోవాలని హితవు పలికారు. సినిమాల పరంగా పవన్ ఓకే గానీ.. రాజకీయాలకు మాత్రం అతడు అన్ ఫిట్ అంటూ మండిపడ్డారు. గతంలో తెలంగాణ భాషను వెక్కిరించి.. రాష్ట్రాన్ని కబ్డా చేశారని పవన్ పై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

మరోవైపు గత పాలకులు ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆగం పట్టించారని కవిత ఆరోపించారు. ఇక్కడ విద్య, వైద్యం, ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క విద్యా సంస్థ వరంగల్ కు రాలేదని కవిత గుర్తుచేశారు. స్థానిక ఎంజీఎం ఆస్పత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో మంత్రులు పొంగులేటి, సీతక్క కలిసి ఇసుక దోపిడి చేస్తున్నారని కవిత ఆరోపించారు.

Advertisement

Also Read: రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం.. అన్నదాత సుఖీభవపై.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యరూపం ఇచ్చారు. హైదరాబాద్ లోని మణికొండలో పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన స్వయంగా ప్రారంభించారు. తెలంగాణ గడ్డపై జనసేనకు సంబంధించి ఇదే తొలి కార్యాలయం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబురాలు చేసుకున్నారు. తెలంగాణలో జనసేన సత్తా ఏంటో చాటిచెప్పేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.

Also Read: కాంగ్రెస్ నేత దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు.. పదంసింగ్ పాటిల్ నిర్దోషి

Related News

HCA Probe: ప్రస్తుత పాలకవర్గానికి TG20 నిర్వహించే అర్హత లేదు: హైకోర్టు సంచలనం!

బి.ఆర్. నాయుడిని కలిసిన హైదరాబాద్ వ్యాపారవేత్తలు.. శ్రీవారి అన్నదానానికి భారీ విరాళం!

Bhagirath Bail: బిగ్ బ్రేకింగ్.. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కి బెయిల్

NEET Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. నీట్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ ‘థాలీ బజావో’ నిరసన!

Flyover Delay: నిజామాబాద్ లీడర్ల పై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే..?

మూలనపడ్డ బండ్ల నెంబర్లతో వందల లీటర్ల డీజిల్ మాయం.. జీహెచ్ఎంసీలో ఖరీదైన దందా..!

Singareni Tension: భూపాలపల్లిలో రణరంగం.. సింగరేణి గని వద్ద కవితను అడ్డుకున్న పోలీసులు!

Big Stories

×