Kalvakuntla Kavitha: ముస్లింలకు కాగితాలపై కేటాయింపులు చేస్తున్నారే తప్ప బడ్జెట్ రిలీజ్ చేయడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మొహర్రం సంతాప దినాల్లో భాగంగా హైదరాబాద్ లో సోమవారం బీబీకా ఆలంను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మొహర్రం ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అషుర్ ఖానాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు.
Also Read: నా రాజాను వదిలేయండి.. పోలీసు స్టేషన్ ఎదుట.. దివ్వెల మాధురి రచ్చ రచ్చ!
మొహర్రం అంటేనే హజ్రత్ ఇమామ్ హుస్సేన్ కర్బాలా మైదానంలో చేసిన త్యాగం గుర్తుకు వస్తుందని కవిత అన్నారు. మానవీయత, సత్యం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. నిజాం కాలం నుంచి ఏ పండుగ అయినా కలిసి మెలిసి చేసుకునే సంస్కృతి ఇక్కడ ఉందన్నారు. బీబీకా ఆలం ఊరేగింపులో ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా ఉండేదన్నారు. మైనార్టీలకు బడ్జెట్ పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కవిత మరోమారు డిమాండ్ చేశారు.
Also Read: ‘మెునగాడు కాదు.. మోసగాడు’.. సీఎం రేవంత్పై విరుచుకుపడ్డ హరీశ్ రావు!