Cyber Safety: సైబర్ భద్రత.. సురక్షిత డిజిటల్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ‘ఫ్రాడ్ కో ఫుల్ స్టాప్’ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో భాగంగా నెలరోజులపాటు ‘సురక్షా కా తిరంగా.. సైబర్ సేఫ్ తెలంగాణ’ ప్రచార కార్యక్రమాన్ని గురువారం డీజీపీ సీ.వీ.ఆనంద్.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గొయల్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శిఖా గొయల్ మాట్లాడుతూ త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా మూడు శక్తివంతమైన సందేశాలను ఇవ్వనున్నట్టు తెలిపారు. ‘కాషాయ రంగు అప్రమత్తంగా ఉండండి.. తెలుపు రంగు అవగాహన పెంచుకోండి.. ఆకుపచ్చ రంగు సురక్షితంగా ఉండండి’ అని సూచిస్తాయన్నారు. నెల రోజులపాటు సాగే కార్యక్రమంలో మొదటి వారం విద్యార్థులు, యువత.. రెండో వారంలో ఉద్యోగులు, వృత్తి నిపుణులు.. మూడో వారంలో సీనియర్ సిటిజెన్లు, కమ్యూనిటీ సంస్థలకు చెందిన వారికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్నట్టు పేర్కొన్నారు.
Also Read: శాంసంగ్ ఇండిపెండెన్స్ డే ఆఫర్.. బెస్పోక్ ఏఐ ప్రొడక్ట్స్పై.. ఏకంగా రూ.19,470 క్యాష్ బ్యాక్!
ప్రతీ ఒక్కరూ సైబర్ రాయబారులుగా మారాలని శిఖా గోయల్ ప్రజలకు సూచించారు. అప్పుడే సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చని స్పష్టం చేశారు. అనుకోకుండా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. తద్వారా కేటుగేళ్ల మోసాల నుంచి బయటపడేందుకు ఆస్కారం ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు.
Also Read: ఎడారి మధ్యలో శవం… 99 నిమిషాల థ్రిల్లర్… చివరి వరకు సస్పెన్స్ గ్యారెంటీ