E-Paper
Advertisement

కమీషన్ల కక్కుర్తి వల్లే.. హైదరాబాద్‌లో దాహార్తి.. ప్రభుత్వంపై కవిత ఫైర్!

కమీషన్ల కక్కుర్తి వల్లే.. హైదరాబాద్‌లో దాహార్తి.. ప్రభుత్వంపై కవిత ఫైర్!
Advertisement

Kalvakuntla Kavitha: వర్షాకాలం మొదలైన తర్వాత కూడా హైదరాబాద్ లో నీటి కష్టాలు కొనసాగటం దారుణమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జూలై నెలలోనూ రోజుకు 10 వేల ట్యాంకర్లు బుక్ చేసుకునే పరిస్థితి ఉందంటే హైదరాబాద్ మహా నగరంలో తాగునీటికి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్ లో నీటి కష్టాలపై మంగళవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

హైదరాబాద్ లో నీటి కష్టాలను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని ఎక్స్ లో కవిత విమర్శించారు. నగర దాహార్తిని తీర్చేందుకు కొండ పోచమ్మ సాగర్ నుంచి ప్లాన్ చేసిన తాగు నీటి పథకాన్ని కాదని.. మల్లన్నసాగర్ నుంచి గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్ -2, ఫేజ్ – 3 ను చేపట్టారన్నారు. ఇది కేవలం ఓ సంస్థకు భారీ లాభాన్ని చేకూర్చి భారీ మొత్తంలో కమీషన్లు దండుకోవాలనే కుట్ర అని చెప్పారు. ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తి కారణంగా మహా నగరంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: భక్తులకు BSNL గుడ్ న్యూస్.. రూ.196కే ‘యాత్రా సిమ్’.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

నగరంలో నీటి కొరత లేకుండా చేసేందుకు ప్రభుత్వం వద్ద కనీసం ముందస్తు ప్రణాళిక లేదని కవిత అన్నారు. ఎల్ నినో ముప్పు పొంచి ఉందని హెచ్చరించినా ముందు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. ఇకనైనా హైదరాబాద్ మహా నగర ప్రజలకు నీటి కష్టాలు తీర్చే ప్రయత్నాలు మొదలు పెట్టాలని కోరారు. వెంటనే గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: గూగుల్ మ్యాప్స్‌లో దాగున్న.. 5 మ్యాజికల్ ఫీచర్లు.. తెలిస్తే థ్రిల్ అవుతారు!

Related News

జగిత్యాల కలెక్టరేట్‌లో పొంగులేటి సమీక్ష.. తహసీల్దార్ సస్పెన్షన్, ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసులు!

ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

‘కేటీఆర్ పిల్లలే చెప్పారు’.. బీఆర్ఎస్ గుట్టు విప్పిన సామా రామ్మోహన్!

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చలు!

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

Big Stories

Advertisement
×