E-Paper
Advertisement

Balamrutham: తెలంగాణ ఫుడ్స్ వేదికగా సీఎం రేవంత్ సంచలన హామీ.. మహిళలకు బంపర్ ఆఫర్!

Balamrutham: తెలంగాణ ఫుడ్స్ వేదికగా సీఎం రేవంత్ సంచలన హామీ.. మహిళలకు బంపర్ ఆఫర్!
Advertisement

Balamrutham: తెలంగాణ ఫుడ్స్‌లో బాలమృతం కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గర్భిణీలను ఆదుకోవాలని ఆనాడు ఇందిరాగాంధీ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అంచెలంచెలుగా ఇది ఒక పరిశ్రమగా ఎదిగిందని, దాని ప్రతిఫలంగానే ఇవాళ మనం నూతన బాలామృతం ప్లాంట్‌‌ను ప్రారంభించుకున్నాం అని సీఎం అన్నారు.

మహిళలే యజమానులుగా..

ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నుంచి మంత్రి సీతక్క వరకు మహిళలు రాజకీయాల్లో రాణిస్తారని నిరూపించారు. ఇందిరమ్మ ఇండ్లను మహిళ పేరుతోనే ఇస్తున్నామని అన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, పట్టణ ప్రాంతంలో పేదలను ఆదుకునేందుకు ఓక లక్ష ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశామని అన్నారు. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును మహిళకు అప్పగించామని, 2034 లోగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం అని, ఆ దిశగా చర్యలు చేపడుతూ ముందుకు వెళుతున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

Also read: Prakash Raj: ప్రకాష్ రాజ్‌కు బిగ్ షాక్.. పోలీసులకు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ఫిర్యాదు..!

బ్రేక్ ఫాస్ట్ స్కీం..

ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు. గర్బిణీ ఆడబిడ్డలకు పౌష్టిక ఆహారం అందించాలనే బాలామృతం కొత్త ప్లాంటు ప్రారంభించుకున్నామని, అభివృద్ధి చెందిన ఆరోగ్య తెలంగాణ ఏర్పాటు చేయాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. పేదల బిడ్డలు ఆకలితో ఉండకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం ను తీసుకొచ్చాం. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కీం మొదలు పెట్టామని అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు.

రాజకీయాలకి అతీతం..

Advertisement

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇది మేం ఖర్చుగా భావించడంలేదు విద్యార్థుల ఆరోగ్యం, చదువు పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ఓటు బ్యాంకు పథకాలు కాదు.. విద్యార్థుల భవిష్యత్ బాగు కోసమే మా ప్రభుత్వం పనిచేస్తోందని, రాజకీయాలకి అతీతంగా ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also read: భక్తులకు BSNL గుడ్ న్యూస్.. రూ.196కే ‘యాత్రా సిమ్’.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

Related News

పరిపాలనలో పారదర్శకత.. ‘డిజిటల్ గవర్నెన్స్’కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

కమీషన్ల కక్కుర్తి వల్లే.. హైదరాబాద్‌లో దాహార్తి.. ప్రభుత్వంపై కవిత ఫైర్!

Belt Shops: కమలాపూర్ గ్రామపంచాయతీ సంచలన నిర్ణయం.. అలా చేస్తే మహిళల చేతిలో దాడి..!

Huzurabad: స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్‌లొ కదిలిన ఆర్టీసీ యంత్రాంగం..!

జిమ్‌లో కేటీఆర్ కొడుకు హిమాన్షుకు ప్రమాదం.. AIG ఆసుపత్రికి కేసీఆర్!

సింగరేణికి కేంద్రం భారీ ఊరట.. తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయిస్తూ కీలక నిర్ణయం

Finance Delay: రాష్టంలో వైద్య విద్యార్థుల భవిష్యత్తు అంధకారం.. క్లాసులు ప్రాక్టికల్స్ బంద్.. కారణం ఇదే!

Big Stories

Advertisement
×