E-Paper
Advertisement

Kavitha: కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలి.. ఖమ్మం ఆందోళనలో కవిత సంచలన డిమాండ్

Kavitha: కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలి.. ఖమ్మం ఆందోళనలో కవిత సంచలన డిమాండ్
Advertisement

ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలుగుమట్ల భూ నిర్వాసితుల పక్షాన తెలంగాణ జాగృతి పోరాటం ఉధృతం చేసింది. బాధితులకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం నాడు తెలంగాణ జాగృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ నాయకులు సంయుక్తంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బాధితుల గొంతుకగా నిలబడతామని భరోసా ఇచ్చారు.

వెలుగుమట్ల భూ బాధితుల సమస్యలను రాష్ట్రస్థాయిలో బలంగా వినిపించామని ఆమె పేర్కొన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ లేదా స్వచ్ఛంద సంస్థ కూడా ఈ స్థాయిలో బాధితుల పక్షాన నిలబడలేదని గుర్తుచేశారు. నిర్వాసితుల ఆకాంక్షలు నెరవేరే వరకు తమ పోరాటం వివిధ రూపాల్లో కొనసాగుతుందని హెచ్చరించారు. బాధితుల ఇళ్లను ఎక్కడైతే కూల్చివేశారో.. సరిగ్గా అదే ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

ప్రభుత్వ వాదనలను తప్పుబడుతూ ఆ భూమి ప్రభుత్వానిది కాదని కవిత తేల్చిచెప్పారు. అది కేవలం భూదాన్ భూమి మాత్రమేనని.. ఆ భూములపై పేదలకు పూర్తి హక్కు ఉంటుందని వివరించారు. భూదాన్ సిద్ధాంతం ప్రకారం ఆ స్థలాలు పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అక్రమంగా ఇళ్లు కూల్చివేసి పేదలను రోడ్డున పడేయడం అమానుషమని మండిపడ్డారు.

న్యాయం లభించే వరకు నిర్వాసితులకు అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు పునరావాసం కల్పించాలని కోరారు. ఈ ఆందోళనలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలిసేలా పోరాడతామని వారు ప్రతిన పూనారు.

Advertisement

ALSO READ: CM Revanth Reddy: పోలీసులు అప్‌గ్రేడ్ కావాలి.. కొత్త తరహా నేరాలను ఎదుర్కోవడమే అతిపెద్ద సవాలు: సీఎం రేవంత్ రెడ్డి

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×