BigTV English
Advertisement

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత రోల్ ఇదే.. అసలేం జరిగిందంటే..?

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత రోల్ ఇదే.. అసలేం జరిగిందంటే..?

Kavitha: త్వరలోనే కవిత అరెస్ట్.. ఆమె తీహార్ జైలుకు వెళ్లడం ఖాయం.. బీజేపీ నేతలు పదే పదే కవ్విస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా సాక్షాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏంటి? ఆ స్కాంలో ఆమె పాత్ర ఎంత? తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. ఈడీ సమర్పించిన మొదటి చార్జిషీట్‌లో కవితకు ఈ స్కామ్‌లో ఉన్న సంబంధం గురించి ప్రస్తావించింది. ఆ చార్జిషీట్‌లో ఏముందంటే…..


“ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన జరిగే సమయంలోనే సమీర్ మహేంద్రుతో అరుణ్ రామచంద్రన్ పిళ్లై ద్వారా కవిత ఫోన్‌లో మాట్లాడారు. కవిత తరఫున పిళ్లై, బోయిన్‌‌పల్లి అభిషేక్, ఆడిటర్ బుచ్చిబాబు ప్రతినిధులుగా ఉన్నారు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో భాగస్వాములుగా చేరడానికి ఆసక్తిగా ఉన్నట్టు పిళ్లై ద్వారా సమీర్ మహేంద్రుకు కవిత చెప్పారు. సమీర్ మహేంద్రు హైదరాబాద్ వచ్చి కవిత నివాసంలో చర్చలు జరిపారు. ఆ సమయంలో ఆమె భర్త అనిల్, గోరంట్ల బుచ్చిబాబు, శరత్‌చంద్రారెడ్డి, పిళ్ళై, బోయిన్‌పల్లి అభిషేక్ తదితరులు ఉన్నారు.

ఢిల్లీలోని ఒబెరాయ్ మెయిడెన్ హోటల్‌లో జరిగిన మీటింగులోనూ కవితతో చర్చించి 65% మేర వాటాలకు సమీర్ అంగీకరించారు. కవితకు సన్నిహితుడైన వెన్నమనేని శ్రీనివాసరావు ఆమె ఆదేశం మేరకు పిళ్ళై నుంచి కోటి రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అప్పజెప్పారు. దాదాపు 100 కోట్ల అడ్వాన్స్.. కిక్‌బ్యాక్ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముట్టచెప్పినందున రీటెయిల్ దుకాణాల్లో ఎల్-1గా నిలిచిన ఇండో స్పిరిట్స్‌లో కవితకు వాటా లభించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీల్లో ఎక్కడా కాగితాల మీద అధికారికంగా కవిత పేరు ఉండదు. ఆమె తరఫున పిళ్ళై ఉన్నారు.” అంటూ ఈడీ తన చార్జిషీట్‌లో తెలిపింది.


Related News

Digital Gold Scam Alert: డిజిటల్ గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ సేఫేనా? సెబీ అలర్ట్!

Jubilee Hills By-Election: కౌంట్‌డౌన్ స్టార్ట్.. జూబ్లీ పీఠం ఎవరిది..?

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

German Scientists: గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకులు.. కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌కు ఇదే నాందా?

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Big Stories

×