E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: ప్రజల కోసమైనా కేసీఆర్ మౌనం వీడాలి!

Kalvakuntla Kavitha: ప్రజల కోసమైనా కేసీఆర్ మౌనం వీడాలి!
Advertisement

Kalvakuntla Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్‌చాట్‌లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఉరి తీయాల్సి వస్తే.. రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు.. రెండుసార్లు ఉరి తీయాలని కవిత ఘాటుగా స్పందించారు. పాలమూరు ప్రాంతానికి రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని, ఉద్యమ నాయకులను పట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.

తాను తన ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3వ తేదీనే రాజీనామా లేఖ ఇచ్చానని కవిత వెల్లడించారు. అయితే, మండలిలో  చివరిసారిగా మాట్లాడేందుకు అనుమతి కోరానని, అందుకే ఛైర్మన్‌ను కలిసేందుకు వచ్చానని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా చేయడం అన్యాయమని విమర్శించారు.

Advertisement

ప్రస్తుత రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా వచ్చి మాట్లాడితేనే బాగుంటుందని కవిత అభిప్రాయపడ్డారు. “ప్రజల కోసమైనా కేసీఆర్ ఒక క్లారిటీ ఇవ్వాలి. పిల్ల కాకుల మీద వదిలేస్తే వాళ్లకు ఏం తెలుస్తుంది?” అని పరోక్షంగా పార్టీలోని కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలంగాణ జాగృతి మళ్లీ యాక్టివ్ అయితే, బీఆర్ఎస్‌కు గడ్డుకాలం తప్పదని హెచ్చరించారు. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్‌పైనే ఉందన్నారు.

Read Also: Telangana Assembly Sessions: మూసీ సుందరీకరణ.. బీఆర్ఎస్ ప్రశ్నలపై సీఎం రేవంత్ క్లారిటీ

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×