Kalvakuntla Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్చాట్లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను ఉరి తీయాల్సి వస్తే.. రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు.. రెండుసార్లు ఉరి తీయాలని కవిత ఘాటుగా స్పందించారు. పాలమూరు ప్రాంతానికి రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని, ఉద్యమ నాయకులను పట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.
తాను తన ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3వ తేదీనే రాజీనామా లేఖ ఇచ్చానని కవిత వెల్లడించారు. అయితే, మండలిలో చివరిసారిగా మాట్లాడేందుకు అనుమతి కోరానని, అందుకే ఛైర్మన్ను కలిసేందుకు వచ్చానని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చేయడం అన్యాయమని విమర్శించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా వచ్చి మాట్లాడితేనే బాగుంటుందని కవిత అభిప్రాయపడ్డారు. “ప్రజల కోసమైనా కేసీఆర్ ఒక క్లారిటీ ఇవ్వాలి. పిల్ల కాకుల మీద వదిలేస్తే వాళ్లకు ఏం తెలుస్తుంది?” అని పరోక్షంగా పార్టీలోని కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలంగాణ జాగృతి మళ్లీ యాక్టివ్ అయితే, బీఆర్ఎస్కు గడ్డుకాలం తప్పదని హెచ్చరించారు. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్పైనే ఉందన్నారు.
Read Also: Telangana Assembly Sessions: మూసీ సుందరీకరణ.. బీఆర్ఎస్ ప్రశ్నలపై సీఎం రేవంత్ క్లారిటీ