E-Paper
Advertisement

CM KCR: అలర్ట్ అయ్యారా? కంగారు పడుతున్నారా?.. కేసీఆర్ స్కెచ్ ఏంటి?

CM KCR: అలర్ట్ అయ్యారా? కంగారు పడుతున్నారా?.. కేసీఆర్ స్కెచ్ ఏంటి?
Advertisement

CM KCR: మునుగోడు ఎలక్షన్ తర్వాత.. గులాబీ బాస్ ఇక బీఆర్ఎస్ పై ఫుల్ ఫోకస్ చేస్తారని అనుకున్నారు. నేషనల్ పాలిటిక్సే ఆయన మెయిన్ ప్రయారిటీ అని భావించారు. కానీ, జరుగుతున్నది వేరు. తెలంగాణలో పార్టీ బలోపేతం మీద దృష్టి సారిస్తూ.. మరీ ముఖ్యంగా యాంటీ బీజేపీ వ్యూహాలు రెడీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టి.. ఎమ్మెల్యేలను అలర్ట్ చేసి.. వచ్చే ఏడాది పాటు ప్రజల్లోనే ఉండాలంటూ ఆదేశించడం ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారమైతే ఉంది. ఆ మేరకు సర్వే రిపోర్టులు సైతం ఆయన టేబుల్ మీద ఉన్నాయని తెలుస్తోంది. ఇలాగైతే కుదరదనుకున్నారో ఏమో.. గెలుపే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజాబాట పట్టిస్తున్నారు. సిట్టింగులకే ఛాన్స్ అంటూ ఆశ కల్పిస్తూనే.. పని తీరు సరిగా లేకపోతే యాక్షన్ తప్పదంటూ వార్నింగులు కూడా ఇచ్చారు. నేతలెవరూ పార్టీ వీడకుండా.. బీజేపీ గాలానికి చిక్కకుండా.. కవిత ప్రస్తావన చేయడం కూడా.. అంతా వ్యూహాత్మకమే అంటున్నారు.

Advertisement

సీఎంగా కేసీఆర్ మరో ఆసక్తికరమైన రివ్యూ కూడా చేశారు. తెలంగాణలో రోడ్లన్నీ అద్దంలా మెరవాలని.. పాడైన రహదారులను ఎప్పటికప్పుడు రిపేర్లు చేయించాలంటూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఇలా ప్రజా సమస్యలపై సమావేశం పెట్టడం ఈ మధ్య కాలంలో అరుదైన విషయమే అంటున్నారు. మరోవైపు, జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని సైతం ప్రారంభించనుంది ప్రభుత్వం. ఇలా, ఎన్నికల నాటికి ఒక్కో పబ్లిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్లేలా.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్ కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఇక, కొత్త సచివాలయ నిర్మాణాన్ని మరోసారి పరిశీలించారు ముఖ్యమంత్రి. పనులు 90శాతం పూర్తైనట్టు చెబుతున్నారు. వీలైతే సంక్రాంతికే సెక్రటేరియేట్ బిల్డింగ్ ను స్టార్ట్ చేసేలా ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి అంటూ ఎనిమిదేళ్లుగా తనపై వస్తున్న విమర్శలకు త్వరలోనే చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన మోదీ సైతం.. మూఢనమ్మకాల ప్రభుత్వం అంటూ పరోక్షంగా కేసీఆర్ పై విమర్శలు చేయడం.. మోదీ పర్యటన జరిగిన వారంలోపే సీఎం సచివాలయ పనులు పరిశీలించడం యాధృచ్చికం కాకపోవచ్చని అంటున్నారు.

Advertisement

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించకుండా వారిని కాపాడుకుంటూ.. ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి భగ్గుమనకుండా సమస్యలు పరిష్కరించుకుంటూ.. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టుకుంటూ.. వచ్చే పది నెలల కాలం పూర్తిగా తెలంగాణ రాజకీయాలపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇదంతా కంగారు వల్లా? లేదంటే, యాక్టివ్ అయ్యారా? అనే అనుమానమూ లేకపోలేదు. ఇలా, బీఆర్ఎస్ పేరుతో ఢిల్లీకి రాకుండా.. గులాబీ బాస్ ను తెలంగాణకే కట్టడి చేసేలా.. ఆయనకు రాష్ట్రంలో రాజకీయ అత్యవసర పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నంలో కమలనాథులు బాగానే సక్సెస్ అయ్యారని చెబుతున్నారు.

Related News

శ్రీకాకుళం జిల్లా డీఎస్సీలో మరో బిగ్ స్కామ్ బట్టబయలు.. టాప్ మార్కులు వచ్చినా రాని టీచర్ ఉద్యోగం!

తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనలో ఊహించని ట్విస్ట్.. సీనియర్లకు బిగ్ షాక్!

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికిందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!

డిప్యూటీ సీఎం ఇస్తేనే కేబినెట్‌లోకి వెళ్తా.. ఏఐసీసీకి మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్‌!

కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్.. ఆ విషయంలో ఇక అన్ని పార్టీలు అటువైపే..?

రెండేళ్లు చాన్సివ్వండి.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ది..ప‌రీక్ష‌లో మంచి మార్కులు తెచ్చుకుంటా! ఆ త‌రువాత మీ జీత‌భ‌త్యాలు నేను చూసుకుంటా!

కృష్ణా నీటి వివాదంపై తేలని పంచాయితీ.. కీలక వ్యాఖ్యలు చేసిన కేఆర్ఎంబీ!

కేటీఆర్ జెన్‌జీ మంత్ర.. విద్యార్థులు, నిరుద్యోగుల‌తో ఢిల్లీ బాట‌..! జెన్‌జీ మ‌న‌సు గెలుచుకునే ప్ర‌య‌త్నం..

Big Stories

Advertisement
×