Danam Nagender: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా భూముల వ్యవహారంపై జరిగిన చర్చలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాజీ మంత్రి కేటీఆర్పై అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో వివరించిన ఆయన, స్వయంగా తన కుటుంబానికి చెందిన భూమినే కేటీఆర్ కబ్జా చేశారని పేర్కొనడం సభలో పెను దుమారం రేపింది.
దానం నాగేందర్ మాట్లాడుతూ.. తన తండ్రికి చెందిన భూమిని గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ అక్రమంగా ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు. తాను హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన వాడినైనప్పటికీ, అప్పటి ప్రభుత్వ వైఖరితో భయపడి ఇన్నాళ్లూ మౌనంగా ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యుల భూములను కబ్జా చేస్తున్నా ఏమీ చేయలేక నోరు మూసుకుని కూర్చున్నామని ఆయన గుర్తు చేశారు.
ముఖ్యంగా బాలానగర్ ప్రాంతంలో జరిగిన భూముల స్కామ్లపై దానం తీవ్రంగా మండిపడ్డారు. కేవలం తన భూమి మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల భూ కబ్జాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమాల వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీయడానికి, తక్షణమే ఒక హౌస్ కమిటీని వేసి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. బాలానగర్ భూముల వ్యవహారంపై హౌస్ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలన్నింటిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Also Read: బ్లీచింగ్ పౌడర్కు కూడా పైసల్లేవు.. పంచాయతీలు బాగుపడేది ఎప్పుడో? అసెంబ్లీలో పాల్వాయి నిప్పులు!
నా సొంత భూమిని కేటీఆర్ కబ్జా చేశారు: దానం నాగేందర్
హైదరాబాద్ లో పుట్టి పెరిగినా ఏం చేయలేక నోరు మూసుకున్నాం
గత బీఆర్ఎస్ హయాంలో వేల ఎకరాల భూ కబ్జాలు జరిగాయి
వాటి అన్నింటిపైనా హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాము
– దానం నాగేందర్
KTR has encroached on my own land. Even though… pic.twitter.com/ocAOkVL5eb
— BIG TV Breaking News (@bigtvtelugu) March 29, 2026