BigTV English
Advertisement

Telangana Model City: ఈ నగరానికి ఏమైంది? అందరి చూపు ఇటు వైపే..

Telangana Model City: ఈ నగరానికి ఏమైంది? అందరి చూపు ఇటు వైపే..

Telangana Model City: తెలంగాణ రాష్ట్రంలో ఇదొక నగరం. ఇప్పుడు అందరి చూపు ఆ నగరం వైపే ఉంది. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు నగరమైన ఈ నగరం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏంటా విషయం అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి.. మీరు కూడా ఈ నగరంపై ఓ లుక్కేయండి.


చూపంతా ఇటువైపే..
ఈ జిల్లా కేంద్రం ఏర్పడ్డాక ఎప్పుడూ కనీవినీ రీతిలో అభివృద్ధి వైపు దూసుకుపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరీ ఈ నగరంపై దృష్టి సారించాయి. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మాత్రం వెనుకబడ్డ ఈ జిల్లా, యావత్ దేశం చూసేలా తయారు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఇక్కడ జరిగే అభివృద్ధి పనుల గురించి తెలుసుకొని, పక్క జిల్లా వారు కూడా ఈర్ష్య, అసూయ పడుతున్నారంటే, ఇక్కడి అభివృద్ధి తీరు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. ఇంతకు ఇంతలా అందరినీ ఆశ్చర్యకితులను చేస్తున్న ఆ జిల్లా ఏదో కాదు ఖమ్మం.

ఈ నగరానికి తిరుగు లేదు
ఇక ఈ నగరానికి తిరుగులేదని చెప్పవచ్చు. ఖమ్మం జిల్లా కేంద్రమన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ జిల్లా ఎప్పటి నుండో అభివృద్ధికి నోచక అలాగే కాలం వెళ్లదీస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఖమ్మం ఇప్పుడు అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పడం కన్నా, హై స్పీడ్ లో దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇంతకు ఇంతలా ఇక్కడ ఏ అభివృద్ధిలో పనులు సాగుతున్నాయో తెలుసుకున్నారంటే, మీరు కూడా ఔరా అనకమానరు.


ఖమ్మం.. ఈ నగరాలకు గుమ్మం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం తరువాత ఖమ్మం నగరం ఆశించిన వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఇంతకాలం ప్రాముఖ్యత సాధించని ఈ నగరం ఇప్పుడు రైల్వే, రోడ్డు, పార్కులు, వైద్య, విద్యా రంగాల్లో విస్తృత ప్రగతిని నమోదు చేస్తోంది. ఇది నల్గొండ, వరంగల్, విజయవాడ మధ్య ఒక ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది.

రైల్వే స్టేషన్ రూపురేఖల మార్పు
ఖమ్మం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.25.41 కోట్ల వ్యయంతో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఎసీ వెయిటింగ్ హాళ్లు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, ఆధునిక పార్కింగ్‌ ఏర్పాటుతో స్టేషన్‌ రూపాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే 45 శాతం పనులు పూర్తయ్యాయి. ఇది ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కలిగించనుంది.

6 నేషనల్ హైవేలు.. రహదారి రాబోయే మార్గం
ఖమ్మం జిల్లా అంతటా రూ.655 కోట్లతో 6 నేషనల్ హైవేలు మంజూరు అయ్యాయి. ఇందులో కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం పట్టణాల్లో బైపాస్ రోడ్లు, నాలుగుదారుల రహదారుల అభివృద్ధి కీలకంగా మారింది. ఈ రహదారులు మౌలిక సదుపాయాలు మెరుగుపరచడమే కాకుండా, పరిశ్రమల ఏర్పాటుకు కూడా దారితీయనున్నాయి.

మున్నేరు వరదలపై శాశ్వత పరిష్కారం
ప్రతి ఏడాది మున్నేరు వరదలు ఖమ్మం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.690 కోట్లతో మున్నేరు నదిపై భారీ కాంక్రీట్ గోడలు నిర్మిస్తున్నారు. దీనివల్ల నీటి ప్రవాహం నియంత్రణలోకి రావడమే కాక, తక్కువ కాలంలో ప్రజలను రక్షించవచ్చు. ఇది ఖమ్మం నగర భద్రతకు అద్భుత అడుగు.

వెలుగుమట్ల అర్బన్ పార్క్.. ప్రకృతితో అనుబంధం
ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్లలో 500 ఎకరాల్లో ఈకో అర్బన్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో వాక్‌వేస్‌లు, జలపాతాలు, సైక్లింగ్ ట్రాక్, బాలల పార్క్‌, జంతు ప్రదర్శనాల వంటి ఆకర్షణలు ఏర్పాటు చేయనున్నారు. ఇది ఖమ్మానికి ఒక హరిత ఊపిరిగా నిలవనుంది. పర్యాటకులను ఆకర్షించే దిశగా ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది.

Also Read: Billionaire in 24 Hours: 24 గంటల్లో 13,280 కోట్ల సంపాదన.. నీది మైండ్ కాదు భయ్యా.. నువ్వు సూపర్ అంతే!

ఖమ్మం కేబుల్ బ్రిడ్జి.. ఒక కొత్త ఐకాన్
ఖమ్మంలో నిర్మాణం జరుగుతున్న కేబుల్ బ్రిడ్జి నగర ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్ట్‌గా మారుతోంది. ఈ బ్రిడ్జి ప్రత్యేక శైలి, ఆధునిక ఇంజనీరింగ్‌తో నిర్మితమవుతోంది. ఇది ఖమ్మం ఖిల్లా నుంచి లకారం చెరువు వరకు సాఫీగా ట్రాఫిక్‌ నిర్వహణతో పాటు రాత్రివేళల్లో లైటింగ్‌తో ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇది నగరానికి ఒక నూతన గుర్తింపుగా మారుతుంది.

మెడికల్ కాలేజ్.. హెల్త్ హబ్
రఘునాథపాలెంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ తోపాటు, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడం ద్వారా వైద్య రంగం లోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇకపై మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.

సత్తుపల్లి పట్టణ అభివృద్ధి.. ఒక నమూనా
సత్తుపల్లి మున్సిపాలిటీకి రూ.100 కోట్లు మంజూరు అయ్యాయి. వీటితో షాదీఖానా, సీసీ రోడ్లు, డ్రైన్లు, పార్కులు, అంబేద్కర్ భవనం, వివేకానంద ఎక్స్‌లెన్స్ సెంటర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. పట్టణ సుందరీకరణ, పౌర సదుపాయాల్లో అమూల్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఖమ్మం మున్సిపాలిటీ.. స్వచ్ఛ నగర దిశగా
ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా మంజూరైన రూ.100 కోట్లతో డ్రైన్లు, రోడ్లు, డ్రింకింగ్ వాటర్ లైన్‌లు వేయడం మొదలయ్యాయి. మెరుగైన మురుగునీటి పారుదల వ్యవస్థతో నగరం పరిశుభ్రంగా మారుతోంది. ప్రజల జీవన నాణ్యత పెరుగుతోంది.

ఖమ్మం భవిష్యత్తు.. అభివృద్ధి పథంలో వేగం
ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవ్వగానే ఖమ్మం నగరం ఒక ఆధునిక పట్టణంగా మారనుంది. పర్యాటక, వైద్య, రవాణా, నివాస, విద్య రంగాల్లో మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఖమ్మం ఒక రోల్ మోడల్ నగరంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Related News

Chamala Kiran Kumar Reddy: జర్మనీలో భారత పార్లమెంటరీ బృందం.. SPD నేతలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ

Hyderabad: జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ హత్య కేసులో 24 గంటల్లోనే వీడిన మిస్టరీ!

Bandi Sanjay: బోరబండ రోడ్ షో రగడ.. పోలీసులు ఎంఐఎం తొత్తులా?, బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×