Sports Complex: స్వేచ్ఛ బ్యూరో: ఖమ్మం జిల్లాకు మహర్దశ పట్టనుంది. రూ.92.76 కోట్ల అంచనాతో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రఘునాథపాలెం వద్ద 21.20 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో ఫ్లడ్లైట్ల ఏర్పాటు ద్వారా క్రికెట్ స్టేడియం నిర్మాణం , ఇండోర్ హాల్స్, స్విమ్మింగ్ పూల్ తదితర వసతులు ఉంటాయి.
Also Read: గ్రామ పంచాయతీలో లిక్కర్ నహీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్..!
తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిట శ్రీహరి ఆమోదంతో ఈ ప్రాజెక్టు త్వరలోనే ఖమ్మంలో పట్టాలెక్కనుంది. ఇది పూర్తయితే హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఖమ్మం అతిపెద్ద క్రీడా కేంద్రంగా అవతరించనుంది. దాదాపుగా రూ.92.76 కోట్ల వ్యయ అంచనా గల అత్యాధునిక క్రికెట్ స్టేడియం, భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరావు సూచనల మేరకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ధన్యవాదాలు తెలిపారు. రానున్న కాలంలో ఖమ్మం మిరింత అభివృద్ది జరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు.
Also Read: గడ్డి యంత్రంలో చిక్కుకుని కూలీ మృతి..!