BigTV English

Kishan Reddy: తెలంగాణ పరువుతీశారు.. ఈడీ నోటీసులు రాగానే మహిళా రిజర్వేషన్ గుర్తొచ్చిందా?: కిషన్ రెడ్డి

Kishan Reddy: తెలంగాణ పరువుతీశారు.. ఈడీ నోటీసులు రాగానే మహిళా రిజర్వేషన్ గుర్తొచ్చిందా?: కిషన్ రెడ్డి

Kishan Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. సంచలనం రేపుతోంది ఈ వార్త. అయితే లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మహిళా రిజర్వేషన్ అంటూ కవిత కొత్త నాటకానికి తెరలేపిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌తో కవిత తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారన్నారు.


లిక్కర్ వ్యాపారం చేసి అక్రమంగా డబ్బు సంపాదించి తెలంగాణ రాష్ట్ర పరువును ఢిల్లీలో తీశారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో ఒక మహిళ ఉండటం తానెప్పుడూ చూడలేదన్నారు. కేసీఆర్ కుటుంబం ఇప్పటికే తెలంగాణను మద్యానికి అడ్డాగా మార్చిందని అన్నారు.

ఈడీ నోటీసులు రాగానే మహిళా రిజర్వేషన్ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. సానుభూతి కోసం కల్వకుంట్ల కుటుంబం డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. ఒక మహిళా మంత్రి లేకుండా ఐదేళ్లు పాలన చేసిన పార్టీ మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. అసలు రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు కల్వకుంట్ల కుటుంబానికి లేదని అన్నారు. సీఎం కూతురుకు ఒక చట్టం.. ఇతరులకు మరో చట్టం ఉండదన్నారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×