E-Paper
Advertisement

K. Venkata Rao: కేకే కుమారుడికి బెదిరింపు కాల్స్.. రూ. 3 కోట్లు డిమాండ్.. అసలేం జరిగింది?

K. Venkata Rao: కేకే కుమారుడికి బెదిరింపు కాల్స్.. రూ. 3 కోట్లు డిమాండ్..  అసలేం జరిగింది?
Advertisement

K. Venkata Rao: కాంగ్రెస్‌ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు కుమారుడు వెంకటేశ్వరరావును రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేసిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్‌లో వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఓ స్థలం ఉంది. ప్రస్తుతం ఆ స్థల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే.. ఈ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్‌రెడ్డి, అతడి అనుచరుడు అన్వేష్‌ రెడ్డి రంగంలోకి దిగారు. సదరు ఆస్తితో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటిక.. ఆ క్రమబద్ధీకరణను అడ్డుకుంటామని.. దీని పై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామని వారు వెంకటేశ్వరరావును బెదిరించడం ప్రారంభించారు.

Advertisement

కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలన్నా లేదా కొత్తగా రిట్ పిటిషన్లు వేయకుండా ఉండాలన్నా తమకు 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. విషయం సాఫీగా సాగాలంటే మేము చెప్పింది వినాలి అంటూ ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా పరోక్షంగా హెచ్చరించారు. డబ్బులు ఇవ్వని పక్షంలో న్యాయపరమైన చిక్కులు సృష్టించి.. ఆస్తుల క్రమబద్ధీకరణ కాకుండా అడ్డుకుంటామని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అన్వేష్ రెడ్డి మధ్యవర్తిగా ఉంటూ రఘువీర్‌రెడ్డి తరపున ఈ డిమాండ్లు వినిపించినట్లు సమాచారం.

ఈ వేధింపులు మితిమీరడంతో వెంకటేశ్వరరావు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తనను మానసిక ఆందోళనకు గురిచేస్తూ.. అక్రమంగా డబ్బు వసూలు చేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రఘువీర్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డిలపై BNS సెక్షన్లు 308(3), 351(2), r/w 3(5) కింద కేసు నమోదు చేశారు.

Advertisement

ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. నిందితులు పంపిన మెసేజ్‌లు, కాల్ రికార్డులను పోలీసులు సేకరిస్తున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారు. నిందితులు గతంలో కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: బెల్లంపల్లి బాలికల వసతి గృహంలో ఘోరం.. 40 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×