E-Paper
Advertisement

Konda Surekha: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ.. తొలి సంతకం దాని పైనే..

Konda Surekha: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ.. తొలి సంతకం దాని పైనే..

konda surekha: రాష్ట్ర అటవీ,పర్యావరణశాఖ మరియు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ కార్యకలాపాల మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ సంరక్షణ అధికారి అటవీశాఖ ద్వారా అమలు అవుతున్న పథకాలు, పనులపై ప్రజంటెషన్ ఇచ్చారు.

ప్రస్తుతం అటవీ ,దేవాదాయ శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలు తెలుసుకున్నారు. జంతువుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతూ తొలి సంతకం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి ఏనుగులను తెలంగాణలోకి తెచ్చుకునేందుకు అనుమతిస్తూ మరో సంతకం చేశారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను బాసర జ్ఞాన సరస్వతి దేవస్థాన అర్చక వైదిక బృందం, ఆలయ అధికారులు కలిశారు. మంత్రిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు. అమ్మవారి చిత్ర పటాన్ని బహుకరించారు. వసంత పంచమి పురస్కరించుకొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని మంత్రి సురేఖ తెలిపారు.

Tags

Related News

తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్.. డే అండ్ నైట్ వానలే వానలు

Miryalaguda: మిర్యాలగూడలో ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలుడులో కొత్త విషయాలు, ముగ్గురు సజీవ దహనం

రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్కామ్.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు, హిస్టోరీకల్ డే అంటూ కేటీఆర్ ట్వీట్

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

Big Stories

×