హైదరాబాద్ కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో (Koti Women’s University) వేధింపుల కలకలం చెలరేగింది. విశ్వవిద్యాలయం పరిధిలోని ఉస్మానియా గర్ల్స్ హాస్టల్ (Osmania Girls Hostel) మెస్ ఇంఛార్జ్ తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ బాధిత విద్యార్థినులు ఆన్లైన్లో షీ టీమ్స్కు (She Teams) ఫిర్యాదు చేశారు.
పీజీ చదువుతున్న కొంతమంది మహిళా విద్యార్థినులు, హాస్టల్లోని మెస్ ఇంఛార్జ్ వినోద్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. అతడి కారణంగా హాస్టల్లో ఉండాలంటేనే భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేర్లు బయటపడితే కెరీర్కు ఇబ్బంది కలుగుతుందనే భయంతో, ఆడియో రూపంలో షీ టీమ్స్కు ఆన్లైన్ ద్వారా కంప్లయింట్ పంపించారు.
ఈ వేధింపుల విషయంపై తాము గతంలో చాలా సార్లు ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినప్పటికీ.. పట్టించుకోలేదని విద్యార్థినులు వాపోయారు. షీ టీమ్స్ అధికారులు తమ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని, మెస్ ఇంఛార్జ్ వినోద్పై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థినులు కోరుతున్నారు. ఈ ఘటనపై షీ టీమ్స్ ఎలా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.