E-Paper
Advertisement

KRMB Key decision: తెలంగాణ, ఏపీకి నీటి కేటాయింపులు, మరోసారి భేటీ

KRMB Key decision: తెలంగాణ, ఏపీకి నీటి కేటాయింపులు, మరోసారి భేటీ
Advertisement

KRMB Key decisions(Telangana news live): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రం కావడంతో తాగునీటికి పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కృష్ణాబోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి అవసరాల కోసం నాగార్జున‌సాగర్ నుంచి తెలంగాణ 8.5 టీఎంపీలు, ఏపీకి 5.5 టీఎంసీలు తీసుకునేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హైదరాబాద్‌లోకి జలసౌధలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణకు కేటాయించిన 11 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకుందని ఏపీ ఆరోపణ చేసింది. తెలంగాణ పరిధిలో రెండు కోట్ల మందికి తాగునీటి అవసరాలు ఉన్నాయని వాదించగా, ఏపీలో 17లక్షల జనాభాకే నీరు అందాల్సి ఉందని తెలంగాణ గుర్తు చేసింది.

Advertisement

చివరకు ఏపీ 14 టీఎంసీలు, తెలంగాణ 10 టీఎంసీలు కావాలని చేసిన డిమాండ్ కమిటీ తోసిపుచ్చింది. రిజర్వాయర్లు లేని కారణంగా గతేడాది క్యారీ ఓవర్ కింద ఉన్న 18 టీఎంసీలు ఉండిపోయాయని తెలంగాణ అధికారులు తెలిపారు. ఏపీకి మాత్రం పెన్నా బేసిన్‌కు తరలించి నీటిని నిల్వ చేసుకుందని ఆరోపించింది. శ్రీశైలం నుంచి దిగువకు నీటిని వదులుదామని బోర్డు సభ్యుడు శంఖ్వా ప్రతిపాదించారు.

Also Read: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్.. ఈనెల 20వ తేదీ తర్వాతే రిజల్ట్స్

Advertisement

తాగునీటి అవసరాల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచన చేసింది. మే నెల వరకు రెండు రాష్ట్రాలు 14 టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నాయి. ఇంకా మిగులు మూడున్నర టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించారు. అంతేకాదు మే నెలలో మరోసారి ఈ కమిటీ భేటీ కానుంది. అప్పటి పరిస్థితులను అంచనా వేయనుంది.

Tags

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×