BigTV English

KRMB Key decision: తెలంగాణ, ఏపీకి నీటి కేటాయింపులు, మరోసారి భేటీ

KRMB Key decision: తెలంగాణ, ఏపీకి నీటి కేటాయింపులు, మరోసారి భేటీ

KRMB Key decisions(Telangana news live): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రం కావడంతో తాగునీటికి పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కృష్ణాబోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి అవసరాల కోసం నాగార్జున‌సాగర్ నుంచి తెలంగాణ 8.5 టీఎంపీలు, ఏపీకి 5.5 టీఎంసీలు తీసుకునేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


హైదరాబాద్‌లోకి జలసౌధలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణకు కేటాయించిన 11 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకుందని ఏపీ ఆరోపణ చేసింది. తెలంగాణ పరిధిలో రెండు కోట్ల మందికి తాగునీటి అవసరాలు ఉన్నాయని వాదించగా, ఏపీలో 17లక్షల జనాభాకే నీరు అందాల్సి ఉందని తెలంగాణ గుర్తు చేసింది.

చివరకు ఏపీ 14 టీఎంసీలు, తెలంగాణ 10 టీఎంసీలు కావాలని చేసిన డిమాండ్ కమిటీ తోసిపుచ్చింది. రిజర్వాయర్లు లేని కారణంగా గతేడాది క్యారీ ఓవర్ కింద ఉన్న 18 టీఎంసీలు ఉండిపోయాయని తెలంగాణ అధికారులు తెలిపారు. ఏపీకి మాత్రం పెన్నా బేసిన్‌కు తరలించి నీటిని నిల్వ చేసుకుందని ఆరోపించింది. శ్రీశైలం నుంచి దిగువకు నీటిని వదులుదామని బోర్డు సభ్యుడు శంఖ్వా ప్రతిపాదించారు.


Also Read: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్.. ఈనెల 20వ తేదీ తర్వాతే రిజల్ట్స్

తాగునీటి అవసరాల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచన చేసింది. మే నెల వరకు రెండు రాష్ట్రాలు 14 టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నాయి. ఇంకా మిగులు మూడున్నర టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించారు. అంతేకాదు మే నెలలో మరోసారి ఈ కమిటీ భేటీ కానుంది. అప్పటి పరిస్థితులను అంచనా వేయనుంది.

Tags

Related News

Hyderabad Water Cut: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. నగరంలో రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Big Stories

×