E-Paper
Advertisement

KTR challenges Revanth: లైడిటెక్టర్ టెస్టులకు నేను రెడీ.. ఫోన్ల ట్యాపింగ్ వివాదంపై కేటీఆర్ సవాల్

KTR challenges Revanth: లైడిటెక్టర్ టెస్టులకు నేను రెడీ.. ఫోన్ల ట్యాపింగ్ వివాదంపై కేటీఆర్ సవాల్
Advertisement

KTR challenges Revanth: తమ పాలన సమయంలో ఫోన్ లను ట్యాపింగ్ చేశారన్న విమర్శలపై మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. హైదరాబాదులో ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ లో కేటీఆర్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మధ్యాహ్నం పాల్గొని, బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే సాయంత్రం కేటీఆర్ సైతం రైజింగ్ సమ్మిట్ లో పాల్గొని తెలంగాణ సర్కార్ లక్ష్యంగా విమర్శించారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల రేటు తగ్గిపోవడం వాస్తవమని, అయితే మధ్యతరగతి ప్రజలు, ఒకటి ముద్దు రెండు హద్దు అనే రీతిలో తమ సంతానానికి సంబంధించి ఏకాభిప్రాయంతో జీవితం కొనసాగిస్తున్నారన్నారు. దీనితో ఫ్యామిలీ ప్లానింగ్ అన్ని రాష్ట్రాలలో విజయం సాధించినట్లుగా చెప్పవచ్చన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఫోన్ల టాపింగ్ విషయంపై కేటీఆర్ మాట్లాడుతూ.. తమ పదేళ్ల పరిపాలన కాలంలో ట్యాపింగ్ ఊసే లేదని, కావాలనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఆరోపణలు చేస్తుందన్నారు.

Advertisement

డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, అవసరమైనప్పుడల్లా ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ.. ప్రజల మదిలో తమ పార్టీపై చెడు అభిప్రాయం కలిగించేలా కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తుందన్నారు. ఇంతకు ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారో తెలియాలంటే, తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా లైడిటెక్టర్ టెస్టులు నిర్వహించాలని, అందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని కేటీఆర్ సవాల్ విసిరారు.

తమ పరిపాలన సమయంలో కేవలం ప్రజా సంక్షేమ పాలనకే అధిక ప్రాధాన్యత ఇచ్చామని, తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలతో, తమ పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు. ఇలా రైజింగ్ సమ్మిట్ లో పాల్గొన్న కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడడం, అలాగే ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడం సంచలనానికి దారితీసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న విషయం విదితమే.

Advertisement

Also Read: CM Revanth Reddy: ఎన్ని అడ్డంకులు వచ్చినా.. రైజింగ్ తెలంగాణ.. రైజింగ్ హైదరాబాద్.. ఇదే నా లక్ష్యం.. సీఎం రేవంత్

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులు కూడా అరెస్ట్ కాగా, ఇంకా విచారణ కూడా సాగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ మరోమారు తమ పాలనపై పడ్డ ట్యాపింగ్ మచ్చను చెరిపివేసేందుకు సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ప్రయత్నించారని చెప్పవచ్చు. మరి కేటీఆర్ కి చేసిన విమర్శలపై కాంగ్రెస్ రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×