E-Paper
Advertisement

Singareni Dussehra Bonus: అది బోనస్ కాదు.. పచ్చి బోగస్: కేటీఆర్

Singareni Dussehra Bonus: అది బోనస్ కాదు.. పచ్చి బోగస్: కేటీఆర్
Advertisement

KTR Comments on CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్లపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది బోనస్ కాదు.. బోగస్ అంటూ ఆయన అభివర్ణించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సింగరేణి అద్భుతంగా రాణించిందన్నారు. కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో సింగరేణి లాభాల్లో వాటా 20 శాతానికి మించడంలేదన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read: ఓల్డ్ సిటీ.. కాదు.. ఉగ్రఅడ్డా: కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు

Advertisement

‘మేం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే సింగరేణిని లాభాల బాట పట్టించాం. ఆ సమయంలో రూ. 1,060 కోట్ల లాభాలు వచ్చాయి. 2014 – 15లో రూ. 102 కోట్లకు పైగా సింగరేణి కార్మికులకు బోనస్ గా ఇచ్చాం. ఆ తరువాత 2018 -19లో భారీగా లాభాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్కో కార్మికుడికి రూ. లక్ష బోనస్ గా ఇచ్చాం. 2014లో రూ. 17 వేలు ఇస్తే, పదేళ్లలో లాభాలు పెంచి 2023 నాటికి ఒక్కో కార్మికుడికి రూ. 1.63 లక్షలు అందజేశాం. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దసరా బోనస్.. అది బోనసే కాదు.. బోగస్. దీంతో ఒక్కో కార్మికుడికి రూ. 1.80 లక్షల నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. సింగరేణికి రూ. 4,701 కోట్ల లాభాలు వచ్చాయని, అందులో 33 శాతం వాటా.. అంటే రూ. 1,551 కోట్లు కార్మికులకు ఇచ్చామంటూ డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలా అయితే, ఒక్కో కార్మికుడికి రూ. 3.70 లక్షల లాభం రావాలి. కానీ, ప్రభుత్వం రూ. 1.90 లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారు.. అదెలా సాధ్యం. 16.2 శాతం లాభాల్లో వాటాగా ఇస్తూ 33 శాతం అంటూ ప్రభుత్వం మభ్యపెడుతుంది. సింగరేణిని లాభాల బాట పట్టించిన కార్మికులకు మీరిచ్చే బహుమతి ఇదేనా? అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అందుకు కాంగ్రెస్ చాటుగా సహకరిస్తుంది. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read: కూకట్ పల్లి, అమీన్ పూర్ లో హైడ్రా కొరడా.. అక్రమ అపార్టుమెంట్ల కూల్చివేతలు

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×