Big Stories

KTR Goa Politics: మహబూబ్‌నగర్ బైపోల్.. కేటీఆర్ గోవా పాలిటిక్స్..!

KTR Goa Politics

- Advertisement -

KTR Goa Politics: మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ బైపోల్‌ మాజీ సీఎం కేసీఆర్‌ను టెన్షన్‌ పెడుతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన పడరాని పాట్లు పడుతున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో గోవాలో క్యాంప్ ఏర్పాటు చేశారు.

- Advertisement -

బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గోవా వెళ్లారు. గోవాలో మహబూబ్‌నగర్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం కేటీఆర్ నేతృత్వంలో క్యాంప్‌ పెట్టడంపై రాజకీయంగా వాడివేడి చర్చ జరుగుతోంది.

ఈ నెల 28న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగబోతోంది. బైపోల్‌ కోసం గోవాలో క్యాంప్ పెట్టడంపై పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి భయంతోనే గోవాలో క్యాంప్ పెట్టారంటుని గులాబీ నేతలే అంటున్నారు. ఎమ్మెల్సీ బైపోల్‌లో ఓడిపోతే పరువు పోతుందని, ఆ ప్రభావం పార్లమెంట్‌ ఎన్నికలపైనా పడుతుందని కేసీఆర్, కేటీఆర్ ఆందోళనలో ఉన్నారు.

ఇదే జరిగితే తెలంగాణలో కారు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News